Don't Miss!
- News షర్మిల గురి మారిందా - వారి ఆశలపై నీళ్లు, ఫలితం తారుమారు..!!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Finance RBI: 2000 నోట్లపై కీలక ప్రకటన చేసిన ఆర్బీఐ..
- Technology 50MP సెల్ఫీ కెమెరా తో Samsung కొత్త ఫోన్! లాంచ్,ధర వివరాలు
- Automobiles ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
బ్రహ్మానందంకు ‘గురుశ్రీ’ పురస్కారం
టాలీవుడ్ సినీయన్ నటుడు, స్టార్ కమెడియన్ బ్రహానందం 'గురుశ్రీ' పురస్కారం అందుకున్నారు. కృష్ణాష్టమిని పురస్కరించుకుని శ్రీకళాసుధ తెలుగు అసోసియేషన్ ఆదివారం చెన్నైలో నిర్వహించిన కార్యక్రమంలో బ్రహ్మానందం ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
ఈ సందర్భంగా శ్రీకళాసుధ తెలుగు అసోసియేషన్ 'హాస్యబ్రహ్మ'కు స్వర్ణకంకణ ధారణ చేసింది. ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ.. ఆదిపరాశక్తి కుమారులే త్రిమూర్తులని పేర్కొన్నారు. వీరిలో సృష్టించేవాడు బ్రహ్మ అయితే, నడిపించే వాడు విష్ణువని, ఇక తీసుకెళ్లేవాడు శివుడని, ఈ ముగ్గురినీ కలిపి దేవుడు అంటారని అభివర్ణించారు.
వెయ్యికి పైగా సినిమాల్లో నటించిన బ్రహ్మానందం ఇప్పటికే చరిత్ర సృష్టించారు. అత్యధిక చిత్రాల్లో నటించిన కమెడియన్గా గిన్నిస్ బుక్ రికార్డు సొంతం చేసుకోవడంతో పాటు భారత ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మ్ పద్మ పురస్కారాన్నిసైతం అందుకున్నారు.
నటించిన ప్రతి సినిమాలోనూ ప్రేక్షకులను నవ్విస్తూ...హాస్యానికి కొత్త ఒరవడితో కేవలం హావభావాతో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టడం బ్రహ్మానందం స్టైల్. బ్రహ్మానందంను మొట్టమొదటి సారిగా మూవీ కెమెరా ముందు మేకప్ వేసి నిలబెట్టినవారు దర్శకులు వేజళ్ల సత్యనారాయణ. నరేశ్ కథానాయకుడిగా నటించిన 'శ్రీ తాతావతారం' అనే చిత్రంలో కథానాయకుడి నలుగురు స్నేహితులలో ఒకడిగా నటించారు.
బ్రహ్మానందాని బాగా గుర్తింపు తెచ్చిన తొలి పాత్ర 'అహనా పెళ్లంట' చిత్రంలో అరగుండు పాత్ర. ఆ తర్వాత ఆయన ఖాన్ దాదా, కత్తి రాందాసు, గచ్చిబౌలి దివాకరం లాంటి పాత్రలతో బాగా పాపులర్ అయ్యారు.