Don't Miss!
- News సుమలత దెబ్బకు మాజీ సీఎం హడల్, ఇంతవరకు ప్రచారం చెయ్యలేదు, అసలు మ్యాటర్ !
- Sports IPL 2024: చరిత్ర సృష్టించిన సన్రైజర్స్ హైదరాబాద్!
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
మైము సైతం: కడుపుబ్బ నవ్వించిన బ్రహ్మానందం (వీడియో)
హైదరాబాద్: వైజాగ్ తుపాను బాధితుల సహాయార్థం చిత్రపరిశ్రమ ఏర్పాటు చేసిన మేముసైతం కార్యక్రమంలో పాల్గొన్న కామెడీ కింగ్ బ్రహ్మానందం ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. కామెడీ సన్నివేశాలను ప్రదర్శిస్తూ హాస్యపు జల్లులు కురిపించారు. కార్యక్రమంలో పాల్గొన్న సినీ ప్రముఖులు బ్రహ్మానందం కామెడీతో ఉల్లాసంగా గడిపారు. ఆ స్కిట్ ని మీరూ చూడండి...
హుద్హుద్ తుపాను బాధితుల సహాయార్థం సినీతారలు చేపట్టిన మేముసైతం కార్యక్రమం హైదరాబాద్లో అట్టహాసంగా కొనసాగుతోంది. కృష్ణానగర్లోని అన్నపూర్ణ స్టూడియోలో నటీనటులంతా వారి వారి శైలిలో వినోద కార్యక్రమాల్లో పాల్గొని ప్రేక్షకులను అలరిస్తున్నారు.
హుదు హుద్ తుపాను బాధితుల సహాయార్థం చిత్ర పరిశ్రమ ఏర్పాటు చేసిన మేము సైతం కార్యక్రమం హైదరాబాద్లో ప్రారంభమైంది. అనంత శ్రీరామ్ రచించి, సంగీత దర్శకుడు కోటి స్వరపరిచిన మేము సైతం... గీతాన్ని పలువురు గాయకులు ఆలపించి ఆహుతులను ఆకట్టుకున్నారు.
అలాగే...ప్రజలకు ఎప్పుడు కష్టం వచ్చినా తెలుగు చలనచిత్ర పరిశ్రమ అండగా ఉంటుందని ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న దాసరి మాట్లాడుతూ... గతంలో విపత్తులు సంభవించినప్పుడు చిత్ర పరిశ్రమ ద్వారా అందించిన సాయం వివరాలను గుర్తు చేశారు. 1977 దివిసీమ ఉప్పెన సమయంలో, రాయలసీమ కరవు సమయంలో చిత్ర పరిశ్రమ పలుకార్యక్రమాలు ఏర్పాటు చేసి విరాళాలు సేకరించిందన్నారు.
తుపాను బాధితుల కోసం అప్పట్లో ఎన్టీఆర్ జోలెపట్టి విరాళాలు సేకరించారని గుర్తు చేశారు. సినీనటుడు నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ... తుపాను బాధితుల సహాయం కోసం కళాకారులు వ్యక్తిగతంగా విరాళాలు ఇచ్చినప్పటికీ, చిత్ర పరిశ్రమ ద్వారా అందరం కలిసి ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రముఖ గాయని పి.సుశీల బాధితుల కోసం రూ.లక్ష విరాళాన్ని ప్రకటించారు.
కార్యక్రమంలో సినీ నటులు బాలకృష్ణ, మోహన్బాబు, నాగార్జున, వెంకటేష్, మురళీమోహన్, మంచు విష్ణు, దర్శకులు దాసరినారాయణరావు, రాఘవేంద్రరావు, నిర్మాత అల్లు అరవింద్, సురేష్బాబు తదితరులు పాల్గొన్నారు.