Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
బ్రహ్మికి 20లక్షల SMSలు
ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందంతో ఐ న్యూస్ వారు టెన్ లాక్ షో పేరుతో ఓ గేమ్ షో ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. నేను రెఢీ మీరు రెఢీయా అనే ట్యాగ్ లైన్ తో సిద్దమవుతున్నఈ బ్రహ్మి టెన్ లాక్ షో కి ఎస్.ఎం.ఎస్ ల ద్వారా పాల్గొనే వారి ఎంపిక ప్రారంభమైంది. ఇప్పటికే ఈ షోకి రెండు లక్షల ఎస్.ఎం.ఎస్ లు వచ్చినట్లు ఐ న్యూస్ సీఇఓ రాజశేఖర్ చెప్తున్నారు.మరి కొద్ది రోజుల్లో ఆ ఎస్.ఎమ్.ఎస్ లు ఇరవై లక్షలు దాకా చేరవచ్చునని అంచనా వేస్తున్నారు. ఇలా ఓ గేమ్ షో కు ఇంత పెద్ద మొత్తంలో ఎస్.ఎం.ఎస్ లు రావటం టీవీల చరిత్రలో ఓ రికార్డే నంటున్నారు. గతంలో ధర్మవరపు సుబ్రమణ్యం ఈ తరహా కార్యక్రమాన్ని చేసారు..కానీ ఊహించినంతగా అది క్లిక్ కాలేదు.
ఇక ఈ గేమ్ షో 'కౌన్ బనేగే కరోడ్ పతి' మాదిరిగా జరుగుతుంది. 15 ప్రశ్నలకు ప్రేక్షకులు జవాబిచ్చి 10 లక్షల రూపాయలు గెలుచుకునే అవకాశం ఈ షో లో ఉంటుంది. మొదటి ప్రశ్నకు వెయ్య రూపాయలుతో ఈ షో ప్రారంభమవుతుంది. అక్కడ నుంచి 15 ప్రశ్నలకు జవాబు చెపితే 10 లక్షల రూపాయలు విజేతల సొంతమవుతాయి. మొదటి రౌండ్ కోసం ఎస్.ఎం.ఎస్ ల ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైనవారు బ్రహ్మానందంతో పోరుకు హైదరాబాద్ కు రావాల్సి ఉంటుంది. ఈ షోకి కొంత మంది పాపులర్ స్టార్స్ ని కూడా ఇన్వైట్ చేస్తారు. వారు గెస్ట్ కాంపిటేటర్స్ గా రానున్నారు. బ్రహ్మానందంకు టీవీ తెరపై ఇదే మొదటి షో కావటంతో ఛాలెంజ్ గా తీసుకుని చేస్తున్నారని టీవీ వర్గాలు చెపుతున్నాయి.