Don't Miss!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Lifestyle మనోడు ఎక్కడైనా తగ్గేదేలే అనిపించుకున్నాడు, అల్లు అర్జున్ కు అంతర్జాతీయ గుర్తింపు
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Finance EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
- News రఘురామకు సీటు పై కసరత్తు - కీలక ప్రతిపాదన, ఖాయమయ్యేనా..!!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
బ్రహ్మానందం వన్మేన్ షో అంటున్నారు
బ్రహ్మానందం వన్మేన్ షో ఈ సినిమా. మేం ఊహించిన దానికన్నా మంచి విజయాన్ని సాధిస్తోంది అంటున్నారు జేడీ చక్రవర్తి. జెడీ చక్రవర్తి దర్శకత్వంలో రీసెంట్ గా విడుదలైన చిత్రం 'మనీ మనీ... మోర్ మనీ'. ఈ చిత్రం గతంలో వచ్చిన 'మనీ', 'మనీ మనీ' చిత్రాలకు సీక్వెల్.ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా కలిసిన మీడియాతో ఆయన ఇలా స్పందించారు. చక్రవర్తి ప్రొడక్షన్స్, ఫస్ట్ ఛాయిస్ మీడియా హౌస్ సంస్థలు సంయుక్తంగా 'మనీ మనీ... మోర్ మనీ' నిర్మించాయి. అలాగే బ్రహ్మానందం మాట్లాడుతూ "పూర్తి స్థాయి వినోదాత్మకంగా రూపొందిన ఈ సినిమాను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. సినిమా విడుదలైన నాటి నుండి వర్షాలు ప్రారంభమైనా కూడా థియేటర్కు ప్రేక్షకులు వస్తున్నారు. రెండున్నర గంటల పాటు వినోదాత్మకంగా రూపొందింది. టికెట్ కొన్న ప్రేక్షకుడికి, ప్రతి రూపాయికి వినోదాన్ని అందించే విధంగా చక్రవర్తి తీర్చిదిద్దాడు. ఒక చిన్న సినిమా ఆడితే దానివల్ల మరిన్ని సినిమాలు వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా విజయం నాకు మంచి తృప్తినిచ్చింది అని అన్నారు. అనంతరం మరో నటుడు బ్రహ్మాజి మాట్లాడుతూ.. "మర్యాదరామన్న, మిరపకాయ్ సినిమాల తర్వాత నా పాత్రకు మరింత క్రేజ్ వచ్చిన సినిమా ఇది. ఖాన్దాదా పేదవాడైతే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా కాన్సెప్ట్ అని అన్నారు నిర్మాత మాట్లాడుతూ ...ఖాన్దాదా స్ట్రైక్ అగైన్ అనే కాన్సెప్ట్తో వర్కవుట్ అయిన సినిమా ఇది. బ్రహ్మానందం కామెడీతో పాటు రమాప్రభ, బ్రహ్మాజీల కామెడీ కూడా మెప్పిస్తోంది. సినిమాను మరింత ఆదరించాలి అని అన్నారు.
ఇక మనీ మనీ మోర్ మనీ కథ ప్రకారం... అది 2009వ సంవత్సరం. రౌడీగా నగర ప్రజలను గడగడ లాడించిన ఖాన్దాదా తన గూండాగిరికి స్వస్తి పలికి రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టాడు. పెరిగిన రియల్ బూమ్లో కోట్లకు పడగలెత్తాడు. కాలచక్రం గిర్రున తిరిగింది. 2011వ సంవత్సరం వచ్చేసింది. రియల్ రంగం పేకమేడలా కూలిపోయింది. ఖాన్దాదా లాంటి రియల్ట్టర్లందరూ బొక్కబోర్లా పడ్డారు. ఖాన్దాదా కెవ్వున కేకపెట్టాడు. ఇప్పుడు తనకు మిగిలింది జూబ్లీహిల్స్లో ఒక ఇల్లు, పుట్టెడు అప్పులు. ఫోన్బిల్లు, కరెంట్ బిల్లు కూడా కట్టలేని దుస్థితి.ఈ పరిస్థితిలో ఇల్లు అమ్ముకొని వెళ్లిపోదాం అనుకున్న సమయంలో నలుగురు కిడ్నాపర్లు ఆ ఇంట్లోకి చొరపడ్డారు. ఖాన్దాదాని ఓ బంతిని చేసి క్రికెట్, వాలీబాల్, బేస్బాల్, ఫుట్బాల్ లాంటి ఆటలన్నీ ఆడేశారు. ఈ విపత్కర పరిస్థితుల నుంచి ఖాన్దాదా ఎలా బయపడ్డాడు అనేది క్లైమాక్స్.