Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
'శ్రీరామ రాజ్యం'లో బ్రహ్మానందం పాత్ర
బాలకృష్ణ, నయనతార కాంబినేషన్ లో బాపు రూపొందించిన శ్రీరామ రాజ్యం త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రంలో బ్రహ్మానందం ఓ కీలకమైన పాత్రలో కనిపిస్తారు. ఆ పాత్ర చాకలి తిప్పడు.ఈ విషయమై బ్రహ్మానందం మాట్లాడుతూ "ఇందులో చాకలి తిప్పడు పాత్ర వేశా. వాల్మీకి పాత్రకు అక్కినేని దొరకడం అదృష్టం. ఆ రోజుల్లో నాగయ్య వేసిన పాత్రని తత్తుల్యమైన నటుడు అక్కినేని ఇప్పుడు వేయడం ఆనందకరం. రాముని సంకల్పం వల్లే ఖర్చుకి వెనకాడకుండా తీశారు సాయిబాబు. రామాయణం గురించి అందరికీ తెలియజేయాలని బాపు దర్శకత్వంలో ఈ సినిమా తీశారు. బాలయ్యను చూస్తే రామారావుగార్ని చూసిన భావం కలిగింది. బాలయ్య నటన చిరస్మరణీయంగా నిలుస్తుంది'' అన్నారు.
అలాగే లక్ష్మణ పాత్రధారి శ్రీకాంత్ మాట్లాడుతూ "చిన్నప్పట్నించీ పౌరాణిక చిత్రాలంటే ఇష్టం. తొలిసారి పూర్తిస్థాయి పౌరాణిక చిత్రం చేశా. అలాగే బాలకృష్ణతో తొలిసారి చేశా. ఓ మంచి సినిమాలో నటించినందుకు ఆనందంగా ఉంది. ఇలాంటి సినిమా తియ్యాలంటే నిర్మాతకి గట్స్ ఉండాలి. సాయిబాబుకి హేట్సాఫ్'' అన్నారు. రాముడి పాత్రలో తాను ఎలా ఉంటానోనని ప్రజలు ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారని హీరో బాలకృష్ణ చెప్పారు. అలాగే త్వరలోనే అన్ని హంగులూ పూర్తిచేసుకుని చిత్రం విడుదల కాబోతంది. తెలుగు చూడాలంటే బాపు, తెలుగు వినాలంటే రమణ. ఈ సినిమాకి అద్భుతంగా రమణగారు రచన చేస్తే, అంత అద్భుతంగా బాపుగారు రూపొందించారు. సాయిబాబు ధైర్యం చేసి ఈ చిత్రాన్ని నిర్మించారు అన్నారు.