Don't Miss!
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Sports ఆ చెత్త నిర్ణయమే ఆర్సీబీ కొంపముంచింది- ఫించ్
- News ముందస్తుగానే ఏపీ ఎన్నికల ఫలితాలు - గెలుపెవరిది..!!
- Finance Debt Free: అప్పుల ఊబి నుంచి త్వరగా బయటపడాలా..?? ఇవిగో 5 మార్గాలు..
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
'అదుర్స్' బ్రాహ్మణ జాతిని కించపరిచింది
బ్రాహ్మణ జాతిని కించపరిచిన 'అదుర్స్' సినిమాను నిలిపివేయాలని కోరుతూ సోమవారం మానవహక్కుల కమిషన్లో పిటిషన్ దాఖలైంది. తెలంగాణ బ్రాహ్మణ సంఘాల సమాఖ్య అధ్యక్షుడు చకిలం రాజేశ్వరరావు ఈ పిటిషన్ దాఖలు చేశారు. సినిమాలోని 'చారి' అనే పాటలో 'పిలకజుట్టు' అనే పదానికి బదులుగా 'పాత బైక్' అని, 'నిలువు బొట్టు' స్థానంలో 'ఓల్డ్ స్టైల్' అని మార్పులు చేసి, మిగతా పాటను యథాతథంగా ఉంచారని పిటిషనర్ ఆరోపించారు.
బ్రాహ్మణకులానికి చెందిన ఇద్దరు క్లబ్డాన్స్కు వెళ్లడం, బీరుతాగడం లాంటి సన్నివేశాలు బాధించాయని, దహన సంస్కారాల సందర్భంగా నిర్వహించే సన్నివేశమూ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా ఉందని వివరించారు. ఆ సినిమా పాటల సీడీలు, క్యాసెట్ల అమ్మకాలను నిలిపివేయాలని, 'చారి' పాటను నిషేధించాలని పిటిషనర్ అభ్యర్థించారు. దీనిపై స్పందించిన కమిషన్ ఈనెల 22లోగా నివేదిక సమర్పించాలని ప్రాంతీయ సెన్సార్ బోర్డును ఆదేశించింది.