Don't Miss!
- Sports ఆ రూల్ మా కొంపముంచింది- రుతురాజ్
- News మే 1 నుంచి ఈ రాశులకు అఖండ ధనయోగం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
'బ్రహ్మోత్సవం' సెట్లో :మహేష్ తో వరుణ్,కృతీ సనమ్! (ఫొటోలు)
హైదరాబాద్: మహేష్బాబు హీరోగా నటిస్తున్న చిత్రం 'బ్రహ్మోత్సవం'. శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. పి.వి.పి సినిమా పతాకంపై పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి నిర్మిస్తున్నారు. 'బ్రహ్మోత్సవం' సెట్ తారలతో సందడిగా ఉంటోంది.
మొన్నటికి మొన్న బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ సెట్కు వచ్చి చిత్రబృందాన్ని ఆశ్చర్యానందానికి గురి చేస్తే.. ఇప్పుడు యువ హీరో వరుణ్ ధావన్ సెట్కు వచ్చి సందడి చేశాడు.
ఆయనతో పాటు కృతి సనన్ కూడా ఉంది. షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న 'దిల్వాలే', మహేష్ 'బ్రహ్మోత్సవం' చిత్రీకరణలు ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్నాయి. గురువారం చిత్రీకరణ విరామ సమయంలో 'బ్రహ్మోత్సవం' సెట్లోకి వరుణ్, కృతి వచ్చి మహేష్ తదితరులతో ముచ్చటించారు. ''మా సెట్ అసలు డల్గా ఉండదు. ఎప్పుడూ బ్రహ్మోత్సవమే'' అని చిత్ర యూనిట్ ఈ ఫొటోలతోపాటు ట్వీట్ చేసింది.
మరిన్ని విశేషాలు...
ఈ చిత్రం ఏప్రియల్ 7,2016న విడుదల చేయటానికి నిర్ణయంచినట్లు సమాచారం. అలాగే మార్చి నెలాఖరకు చిత్రానికి సంభందించిన అన్ని పనలు పూర్తి చేయాలని దర్శక,నిర్మాతలు ఫిక్స్ అయినట్లు చెప్తున్నారు.
దర్శకుడు మాట్లాడుతూ ''సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' తరవాత మళ్లీ మహేష్తో ఓ సినిమా చేయడం ఆనందంగా ఉంది. 'నలుగురు ఉన్న చోట ఓ అందం, ఆనందం ఉంటాయి. అలాంటి అనేకమంది ఒక కుటుంబంలో ఉండి ప్రతి సందర్భాన్ని ఓ ఉత్సవంలా జరుపుకొంటే అదే బ్రహ్మోత్సవం. అలాంటి వాతావరణం మా సినిమాలోనూ కనిపిస్తుంద''న్నారు.
ఈ సినిమాలో మహేష్ ముగ్గురు భామలతో ఆడిపాడనున్నారు. సమంత, కాజల్ అగర్వాల్, ప్రణీత హీరోయిన్లు గా నటిస్తున్నారు. పీవీపీ సినిమా పతాకంపై ప్రసాద్.వి.పొట్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ స్వరాలందిస్తున్నారు.
గతంలో మహేష్ బాబు - శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా కూడా కుటుంబ భావోద్వేగాల నేపధ్యంలో సిద్దం అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. అదే సెంటిమెంట్ ని ఈ సారి కూడా రిపీట్ చేయనున్నారు. పివిపి బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో సత్యరాజ్, రేవతి, జయసుధ, నరేష్ లు ముఖ్య పాత్రలు పోషించనున్నారు.
సత్యరాజ్, జయసుధ, రావు రమేష్, ప్రకాష్రాజ్, తనికెళ్ల భరణి తదితరులు నటిస్తున్నారు. ఛాయాగ్రహణం: ఆర్.రత్నవేలు, సంగీతం: మిక్కీ జె.మేయర్, కూర్పు: శ్రీకర ప్రసాద్, కళ: తోట తరణి