Don't Miss!
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- News దేవినేని ఉమకు కీలక బాధ్యత అప్పగించిన చంద్రబాబు..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఒంటరిగా ఎంజాయ్ చేస్తున్న బాలయ్య హీరోయిన్
ఒంటరి జీవితం ఎంతో బాగుంది. ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ బతికేస్తున్నాను అంటోంది అమీషా పటేల్. బాలకృష్ణ తాజా చిత్రం 'పరమవీర చక్ర'లో నటిస్తున్న ఆమె తన భోయ్ ప్రెండ్ తో విడిపోయి ఒంటరి జీవితం గడుపుతోంది. ఇంకా జంటను వెతుక్కోలేదా అంటే ఇలా స్పందించింది. అలాగే తను ఈ మధ్యన హిందీ చిత్రం 'బ్రేక్ కె బాద్' చూసానని..దర్శకుడు దనీష్ తీసిన తీరు నచ్చిందని కితాబిచ్చింది. ఆ సినిమాలో హీరోయిన్ తన కెరీక్ కోసం ప్రేమను ప్రక్కన పెడుతుంది. హీరోయిన్ అవ్వావలని ఎంతగానో ప్రేమించే వ్యక్తిని కాదని వెళ్ళిపోతుంది. ఆ పాయింటుకు కనెక్టు అయిందో ఏమో గానీ భాక్సాపీస్ డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ఆ సినిమా తెగ నచ్చేసిందంటోంది.
సినిమా గురించి చెబుతూ...సినిమాలో దీపిక-ఇమ్రాన్ జంట చూడముచ్చటగా ఉంది. నిజ జీవితంలో ప్రేమికులు ఎక్కడో ఒక చోట వారితో పోల్చి చూసుకొంటారని చెప్పింది. ఇంతకీ మీరు మిమ్మల్ని దీపికలో చూసుకున్నారా..? అని అడిగితే.."కనవ్ పురితో విడిపోయిన తరవాత నేను ఆయనతో మాట్లాడింది లేదు. ఇప్పుడు మేము ప్రెండ్స్ మి కాదు..అలాగని కనపడితే ఛీ కొట్టుకునేంత శత్రువులం కూడా కాదు. పరస్పర అంగీకారంతోనే విడిపోయాం అంది. ఇక అమీషా పటేల్ గతంలో 'బద్రి', 'నాని' లాంటి చిత్రాల్లో నటించింది.
తాజాగా ఆమెకు బాలీవుడ్ నుండి ఓ భారీ ఆఫర్ వచ్చింది. ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ సంతోషి రూపొందిస్తున్న 'పవర్' చిత్రంలో ఆమెకు హీరోయిన్ గా అవకాశం వచ్చింది. భారీ బడ్జెట్ తో హేమా హేమీల్లాంటి నటుల (అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్, అజయ్ దేవగన్, అనిల్ కపూర్)తో 'పవర్' చిత్రం రూపొందుతోంది.