Don't Miss!
- News మూడు శుభయోగాలతో ఉగాది ప్రారంభం; మూడు రాశులవారికి అదృష్టం!!
- Sports Mumbai Indians కెప్టెన్సీ మార్పు వెనుక సచిన్.. కొడుకు కోసం రోహిత్పై వేటు!
- Lifestyle మీ బాయ్ఫ్రెండ్/గర్ల్ఫ్రెండ్లో ఈ మార్పులు ఉంటే మిమ్మల్ని చీట్ చేయడానికి పన్నాగం పడుతున్నారని అర్థం జాగ్రత్త
- Technology గూగుల్ క్రోమ్ భద్రత కోసం సరికొత్త ఫీచర్.. వెబ్సైట్లోకి వెళ్లగానే మాల్వేర్ అటాక్లపై అప్రమత్తం చేస్తుంది!
- Automobiles రైలు కదిలేముందు జర్క్ ఎందుకు ఇస్తుంది.??.. ఆసక్తికర విషయాలివే.!!
- Finance IPO News: మార్కెట్లోకి రాకేష్ జున్జున్వాలా ఐపీవో.. డబ్బు రెడీ చేసుకుంటున్న ఇన్వెస్టర్లు..
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
బ్రేకింగ్: రష్మిక ఇంటిపై ఐటీ దాడులు.. ఆరోపణలు రావడంతో!
Recommended Video
ఈ మధ్యకాలంలో సినీ నటుల ఇంటిపై ఎక్కువగా ఐటీ దాడులు జరుగుతుండటం చూస్తున్నాం. మొన్నామధ్య నాగార్జున, నాని, వెంకటేష్ లాంటి బడా హీరోల ఇళ్లపై ఐటీ దాడులు చేసిన ఆఫీసర్స్.. ఇటీవలే లావణ్య త్రిపాఠి, అనసూయ, సుమ ఇళ్లపై కూడా ఐటీ రైడ్స్ చేశారు. ఇప్పుడు క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్న ఇంటిపై ఐటీ ఆఫీసర్స్ దాడులు చేయడం హాట్ టాపిక్ అయింది. వివరాల్లోకి పోతే..
భారీ రెమ్మ్యూనరేషన్.. బిజీ హీరోయిన్
'ఛలో' సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ రష్మిక.. 'గీతగోవిందం' సినిమాతో మంచి హిట్ అందుకుంది. ఆ తర్వాత భారీ రెమ్మ్యూనరేషన్ అందుకుంటూ స్టార్ హీరోల సరసన అవకాశాలు పట్టేస్తోంది. ప్రస్తుతం ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్గా మారింది.
ఇంటిపై ఐటీ దాడులు.. ఫ్యాన్స్ షాక్
ఇదిలా ఉంటే కర్ణాటకలోని కొడగు జిల్లా విరాజ్పేటలో ఉన్న రష్మిక మందన్నసొంత ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తుండటం ఆమె అభిమానులకు షాకిస్తోంది. తనిఖీ చేస్తున్న ఐటీ శాఖ ఉద్యోగులు ఆమె ఆదాయానికి సంబంధించి లెక్కలను పరిశీలిస్తున్నారు. ఈ రోజు (జనవరి 16) ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి ఈ సోదాలు జరుగుతున్నాయి. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ట్యాక్స్ కట్టడం లేదన్న ఆరోపణలు..
తెలుగుతో పాటు కన్నడ చిత్రాల్లోనూ రష్మిక మందన్న సత్తా చాటుతోంది. దీంతో ఆమెకు ఆదాయం పెరిగింది. అయితే ఆమె ట్యాక్స్ కట్టడం లేదన్న ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. సినీ సెలబ్రిటీలే లక్ష్యంగా ఐటీ శాఖ దాడులు చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
సరిలేరు నీకెవ్వరు.. రష్మిక మందన్న
మహేష్ బాబు హీరోగా రూపొందిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అలాగే అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో రాబోతున్న సినిమాలో రష్మిక నటించనుంది. మరోవైపు నితిన్తో కలిసి ఆమె చేసిన 'భీష్మ' రిలీజ్కు సిద్ధంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఆమె ఇంటిపై ఐటీ దాడులు జరగడం జనాల్లో హాట్ ఇష్యూగా మారింది.