Don't Miss!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- News AP Elections: నా కాళ్లు పట్టుకున్నావా లేదా ? పెద్దిరెడ్డికి కిరణ్ ఘాటు కౌంటర్.. !
- Finance Cerelac News: పేదదేశాల సెరెలాక్ ఉత్పత్తులో పంచదార..!! FSSAIకి నోటీసులు జారీ..
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
బ్రేకింగ్: రష్మిక ఇంటిపై ఐటీ దాడులు.. ఆరోపణలు రావడంతో!
Recommended Video
ఈ మధ్యకాలంలో సినీ నటుల ఇంటిపై ఎక్కువగా ఐటీ దాడులు జరుగుతుండటం చూస్తున్నాం. మొన్నామధ్య నాగార్జున, నాని, వెంకటేష్ లాంటి బడా హీరోల ఇళ్లపై ఐటీ దాడులు చేసిన ఆఫీసర్స్.. ఇటీవలే లావణ్య త్రిపాఠి, అనసూయ, సుమ ఇళ్లపై కూడా ఐటీ రైడ్స్ చేశారు. ఇప్పుడు క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్న ఇంటిపై ఐటీ ఆఫీసర్స్ దాడులు చేయడం హాట్ టాపిక్ అయింది. వివరాల్లోకి పోతే..
భారీ రెమ్మ్యూనరేషన్.. బిజీ హీరోయిన్
'ఛలో' సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ రష్మిక.. 'గీతగోవిందం' సినిమాతో మంచి హిట్ అందుకుంది. ఆ తర్వాత భారీ రెమ్మ్యూనరేషన్ అందుకుంటూ స్టార్ హీరోల సరసన అవకాశాలు పట్టేస్తోంది. ప్రస్తుతం ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్గా మారింది.
ఇంటిపై ఐటీ దాడులు.. ఫ్యాన్స్ షాక్
ఇదిలా ఉంటే కర్ణాటకలోని కొడగు జిల్లా విరాజ్పేటలో ఉన్న రష్మిక మందన్నసొంత ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తుండటం ఆమె అభిమానులకు షాకిస్తోంది. తనిఖీ చేస్తున్న ఐటీ శాఖ ఉద్యోగులు ఆమె ఆదాయానికి సంబంధించి లెక్కలను పరిశీలిస్తున్నారు. ఈ రోజు (జనవరి 16) ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి ఈ సోదాలు జరుగుతున్నాయి. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ట్యాక్స్ కట్టడం లేదన్న ఆరోపణలు..
తెలుగుతో పాటు కన్నడ చిత్రాల్లోనూ రష్మిక మందన్న సత్తా చాటుతోంది. దీంతో ఆమెకు ఆదాయం పెరిగింది. అయితే ఆమె ట్యాక్స్ కట్టడం లేదన్న ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. సినీ సెలబ్రిటీలే లక్ష్యంగా ఐటీ శాఖ దాడులు చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
సరిలేరు నీకెవ్వరు.. రష్మిక మందన్న
మహేష్ బాబు హీరోగా రూపొందిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అలాగే అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో రాబోతున్న సినిమాలో రష్మిక నటించనుంది. మరోవైపు నితిన్తో కలిసి ఆమె చేసిన 'భీష్మ' రిలీజ్కు సిద్ధంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఆమె ఇంటిపై ఐటీ దాడులు జరగడం జనాల్లో హాట్ ఇష్యూగా మారింది.