యాక్షన్ అదిరింది: అక్షయ్ ' బ్రదర్స్' ట్రైలర్ (వీడియో)
హైదరాబాద్: అక్షయ్ కుమార్ కొత్త చిత్రం వస్తోందంటే అభిమానులకు ఆనందమే. ఆయన తాజా బాలీవుడ్ చిత్రం బ్రదర్స్ ట్రైలర్ బుధవారం విడుదలైంది. మూడు నిమిషాల నిడివి గల ట్రైలర్ని బాలీవుడ్ నటులు రితేశ్ దేశ్ముఖ్, అర్జున్ రాంపాల్ విడుదల చేశారు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
ఈ చిత్రం 2011లో వచ్చిన హాలీవుడ్ చిత్రం 'వారియర్'కి రీమేక్. ధర్మా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్ మల్హోత్రా, అక్షయ్ కుమార్, జాక్వెలీన్ ఫెర్నాండెజ్, జాకీ ష్రాఫ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.



Click it and Unblock the Notifications











