Don't Miss!
- News TTD: తిరుమలలో ఆ సేవలు రద్దు, శ్రీరాముడి ఊరేగింపుకు ప్రత్యేక ఏర్పాట్లు
- Sports Gautam Gambhir: నిద్రలో కూడా ఆర్సీబీనే కలవరిస్తా..! వీడియో
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
‘అత్తారింటికి దారేది’ఎఫెక్ట్ : అల్లు అర్జున్ కూడా...
హైదరాబాద్ : పవన్ తాజా చిత్రం 'అత్తారింటికి దారేది' సూపర్ హిట్ అవటంతో ఇప్పుడు తెలుగు హీరోలంతా తమ సినిమాలు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ గా ప్రమోట్ చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. రీసెంట్ గా బన్నీ చిత్రం 'రేసు గుర్రం' పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని నిర్మాత నల్లమలుపు బుజ్జి తెలియచేసారు. జనవరి 14,2014న తమ సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్నామని, 60 పర్శంట్ పూర్తైందని అన్నారు.
నల్లమలుపు బుజ్జి మాట్లాడుతూ..." మీరు అల్లు అర్జున్ ని పూర్తి స్ధాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో చూస్తారు. బన్ని కెరీర్ లో మొదటి సారి పూర్తి కామెడీ తో చేస్తున్న సినిమా ఇది. సంక్రాంతికి మా సినిమా భారీ ఎత్తున విడుదల చేస్తాం ," అన్నారు.
అల్లు అర్జున్, కిక్ దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్లో త్వరలో 'రేసు గుర్రం' సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. గత సంవత్సరం అక్టోబర్లోనే ఈ చిత్రం అఫీషియల్గా ప్రారంభోత్సవం జరుపుకుంది. అయితే ఇప్పుడు షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ బైక్ రేసర్ గా కనిపించనున్నారని తెలుస్తోంది. బన్నీ ఆ సీన్స్ కోసం బైక్ రేస్ ట్రైనింగ్ అయ్యినట్లు తెలుస్తోంది.
ఒక్కసారి రేసు గుర్రం పరిగెట్టడం మొదలుపెట్టిందంటే విజయం సాధించేదాకా పరిగెడుతూనే ఉంటుంది. అటువంటి వేగంగా పరిగెత్తే గుర్రాన్ని చూస్తే ఎవరికైనా దాన్న ఎక్కి అందరికన్నా ముందు అనుకున్న చోటికి చేరాలని వుం టుంది. ఇదే అంశాన్ని దర్శకుడు సురేందర్రెడ్డి తన చిత్రంలో చూపబోతున్నారు . ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.మాటల్లో చెప్పలేనిది చూపించాం అని చెప్తున్నారు. ఈ సినిమా కొన్ని షెడ్యూల్స్ మిగిలివున్నాయి. వాటిని కూడా అనుకున్న సమయానికి పూర్తి చేయడానికి వేగంగా పనులను పూర్తి చేస్తున్నారు.
శృతిహాసన్, సలోని హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని నల్లమలుపు బుజ్జి, కె. వెంకటేశ్వరరావు సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ : వక్కతం వంశీ, సంగీతం : తమన్, సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస, ఎడిటింగ్ : గౌతం రాజు, నిర్మాతలు : నల్లమలుపు శ్రీనివాస్, వెంకటేశ్వర రావు, దర్శకత్వం : సురేందర్ రెడ్డి