Don't Miss!
- Automobiles విమానంలో ప్రేమ కావ్యం.. అద్భుతమైన సన్నివేశానికి ఫిదా అవుతున్న నెటిజన్లు
- Finance Uday Kotak: కోటక్ బ్యాంక్ స్టాక్ క్రాష్.. పాపం ఉదయ్ కోటక్.. ఎంత నష్టపోయారంటే..
- Sports కోహ్లి.. అసలు ఇదేం బ్యాటింగ్- సునీల్ గవాస్కర్
- News రేవంత్ రెడ్డి సీటుకు భలే డిమాండ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నా పాత్ర ఐదు నిముషాలు మాత్రమే: అల్లు అర్జున్
హైదరాబాద్ : నేను కేవలం అతిథి పాత్ర పోషిస్తున్నాను. సినిమాలో నా పాత్ర ఐదు నిముషాలు మాత్రమే ఉంటుంది. రామ్ చరణ్ సినిమా కావటం, ఆ పాత్ర కరెక్టుగా నాకు ఏప్ట్ గా ఉండటం ఈ సినిమా ఒప్పుకోవటానికి కారణం అంటున్నారు అల్లు అర్జున్. ఆయన రామ్ చరణ్ ఎవడు చిత్రంలో గెస్ట్ గా కనిపించనున్నారు. ఆ పాత్ర చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుందని చెప్తున్నారు.
ప్రస్తుతం ఇద్దరమ్మాయిలతో పనులు మొత్తం పూర్తి కావటంతో ఇప్పుడు అల్లు అర్జున్ దృష్టి మొత్తం రేసు గుర్రం చిత్రంపై ఉంది. సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో ఎటువంటి హంగామాలేకుండా ఫస్ట్ షెడ్యూల్ జరుపుకుంటోంది.
ఈ చిత్రం నెక్స్ట్ షెడ్యూల్ నిమిత్రం వచ్చే నెలలో నార్వేకు ప్రయాణం పెట్టుకున్నారు. అక్కడే సినిమాలో మేజర్ పార్ట్ తీయనున్నారని సమాచారం. ముఖ్యంగా కొన్ని యాక్షన్ సీక్వెన్స్, పాటలు అక్కడే తీస్తారు. ఈ చిత్రం అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అని చెప్తున్నారు.
ఈ చిత్రానికి రేసు గుర్రం అనే టైటిల్ వర్కింగ్ టైటిల్ గా వ్యవహరిస్తున్నారు. అల్లు అర్జున్ సరసన ఈ చిత్రంలో శ్రుతి హాసన్ నటించనుంది. వీరిద్దరూ తొలిసారి కలసి నటించటంతో ట్రేడ్ లో మంచి క్రేజ్ రానుంది. క్రితం సంవత్సరం అక్టోబర్ లో ఈ చిత్రం అఫీషియల్ గా లాంచ్ అయ్యింది.
నల్లుమలుపు బుజ్జి, కె వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ అని చెప్తున్నారు. మనోజ్ పరమహంస ఛాయాగ్రాహకుడుగా పనిచేస్తున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందిస్తున్నారు. ఈ చిత్రంతో పాటు అల్లు అర్జున్...ఎవడు చిత్రంలోనూ చేస్తున్నారు.