twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సభ్య సమాజానికి ఏం మెసేజ్‌ ఇద్దామని?: ‘దువ్వాడ జగన్నాథమ్‌’ టీజర్‌ ఇదిగో

    అల్లు అర్జున్ హీరోగా రూపొందుతోన్న 'దువ్వాడ జగన్నాథం' టీజర్ విడుదలైంది.

    By Srikanya
    |

    హైదరాబాద్‌: ఎప్పుడెప్పుడా అని స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న 'దువ్వాడ జగన్నాథమ్‌' సినిమా టీజర్‌ విడుదలైంది. మహాశివరాత్రి సందర్భంగా విడుదల చేసిన ఈ టీజర్‌లో అల్లు అర్జున్‌ బ్రాహ్మణుడి గెటప్‌లో సందడి చేస్తున్నారు. రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటోంది.

    'ఇలా ఇలా ముద్దులు పెట్టేసి సభ్య సమాజానికి ఏం మెసేజ్‌ ఇద్దామని' అంటూ బన్నీ చెప్పే డైలాగ్‌ సరదాగా అనిపిస్తోంది. డీజే (దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌) కి రీసెంట్ గా రిలీజ్ చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌తో.. ఈ సినిమాపై అంచ‌నాలు మ‌రింత పెరిగాయి మ‌హాశివ‌రాత్రి సంద‌ర్భంగా ఈ రోజు (శుక్ర‌వారం) రిలీజ్ చేసిన ఈ టీజ‌ర్‌తో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఆ టీజర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

    కొద్ది సేపటి క్రితమేటీజర్ విడుదల కాగా సోషల్ మీడియాలో ట్రేండింగ్ టాపిక్ గా మారిపోయింది. ఈ టీజర్ తోనే బిజినెస్ మొత్తం పూర్తి చేయాలనే దిశగా దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు. ముఖ్యంగా హరీష్ శంకర్-బన్నీ కాంబినేషన్ మీద ఉన్న అంచనాలకు తగ్గట్లే టీజర్ కూడా స్టైలిష్ గా ఉండటమే కాకుండా టీజర్ లో చెప్పించిన డైలాగు సైతం అదిరిపోయిందనే టాక్ వచ్చేసింది.

    దిల్ రాజు నిర్మిస్తున్న 'దువ్వాడ జగన్నాథం'లో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. వేసవి కానుకగా మే నెలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఏప్రిల్లో ఆడియో విడుదల చేస్తారు. ఈ చిత్రం ఇప్పటికే ఎక్కువ భాగం షూటింగ్ ని పూర్తి చేసుకుంది. మార్చి కల్లా మిగిలిన భాగాన్ని పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను మొదలు పెట్టనున్నారు.

    దిల్‌రాజు చిత్ర విశేషాలు తెలియజేస్తూ... మా సంస్థ నిర్మిస్తోన్న 25వ చిత్రమిది. ఆర్య పరుగు తర్వాత బన్నీతో హ్యాట్రిక్ కాంబినేషన్‌లో ఈ సినిమా చేయడం ఆనందంగా వుంది. మా బ్యానర్‌లో హరీష్‌శంకర్ వరుసగా చిత్రాలు చేస్తున్నాడు. ఈ ప్రయాణంలో అతనితో చక్కటి అనుబంధం ఏర్పడింది. వేసవి కానుకగా ఏప్రిల్‌లో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.

    హరీష్‌శంకర్ మాట్లాడుతూ దిల్‌రాజుగారి బ్యానర్‌లో వస్తున్న 25వ సినిమా ఇది. దిల్‌రాజుతో తన అనుబంధం 'గబ్బర్‌సింగ్‌' నుంచి కొనసాగుతుందన్నారు. 'ఆర్య' సినిమా వచ్చినప్పటి నుంచి అల్లుఅర్జున్‌తో సినిమా చేయాలని అనుకున్నా.. ఇప్పటికి ఆ కోరిక తీరిందని వెల్లడించారు. అలాగే అల్లు అర్జున్ ప్రతి సినిమాలో తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు. ఆయనతో సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. దిల్‌రాజుగారి సంస్థను నా హోమ్‌బ్యానర్‌గా ఫీలవుతాను. ఈ సంస్థలో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను అని హరీష్‌శంకర్ పేర్కొన్నారు.

    అల్లు అర్జున్‌ సరసన పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. దిల్‌రాజు నిర్మాత. దేవీశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. వేసవి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఐనాక బోస్, ఎడిటర్: గౌతంరాజు, ఆర్ట్: రవీందర్, సంగీతం: దేవీశ్రీప్రసాద్, స్క్రీన్‌ప్లే: దీపక్‌రాజ్, కథ, మాటలు, దర్శకత్వం: హరీష్‌శంకర్.

    English summary
    Stylish Star Allu Arjun's Duvvada Jagannadham (DJ) teaser released today. Produced by Dil Raju & Directed by Harish Shankar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X