Don't Miss!
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- News కేసీఆర్ కు రేవంత్ వార్నింగ్ - ఇక లెక్క పెట్టుకో..!!
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Sports సూర్య సిగ్గుపడాలి.. క్రీడాస్ఫూర్తిని మరిచి నీఛమైన పని!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
విలన్ గ్యాంగ్ తో బన్ని ఫైట్
హైదరాబాద్ : అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం 'రేసుగుర్రం'. శ్రుతిహాసన్, సలోని హీరోయిన్స్. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. నల్లమలుపు బుజ్జి, డా.వెంకటేశ్వరరావు నిర్మాతలు. ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ జరుగుతోంది. అల్లు అర్జున్, విలన్ గ్యాంగ్ తో పోరాట ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారు. ఫైట్ మాస్టర్లు రామ్లక్ష్మణ్ నేతృత్వంలో ఈ సన్నివేశాల్ని రూపొందిస్తున్నారు.
నిర్మాత మాట్లాడుతూ... ''వినోదం, యాక్షన్ అంశాల మేళవింపుతో తెరకెక్కుతున్న చిత్రమిది. కుటుంబ అనుబంధాలకూ ప్రాధాన్యముంది. అల్లు అర్జున్ని తెరపై ఓ కొత్త కోణంలో చూపించబోతున్నామని'' అని అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ... "బన్ని కెరీర్లో ఫుల్లెంగ్త్ ఎంటర్టైనర్గా నిలుస్తుంది. ఆద్యంతం నవ్వులు పండిస్తూనే ఉంటుంది. మా రేసుగుర్రం విశేషాలు ఇంకా తెలుసుకోవాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే'' అని అన్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారని సమాచారం. తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు.
తొలిసారిగా యస్.యస్.థమన్ బన్ని చిత్రానికి సంగీతం అందిస్తుండటంతో సంగీతంపై ఫ్యాన్స్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. థమన్ కూడా చక్కటి బాణీలు అందించడానికి తన శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తున్నాడట. నల్లమలపు శ్రీనివాస్(బుజ్జి). డాక్టర్ వెంకటేశ్వరరావు నిర్మాతలు. ఇద్దరమ్మాయిలతో... సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం చెందిన తరువాత బన్ని చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని భావిస్తున్నాడు.
అలాగే ఊసరవెల్లి సినిమా తరువాత సురేందర్రెడ్డి దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది. ఇతనికీ ఈ సినిమా విజయం ఎంతో అవసరం ఉంది. ఎందుకంటే ఊసరవెల్లి అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.ఈ చిత్రంలో సలోని సెకండ్ హీరోయిన్గా కనిపించనుంది. నల్లమలుపు బుజ్జి, కె. వెంకటేశ్వరరావు సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ : వక్కతం వంశీ, సంగీతం : తమన్, సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస, ఎడిటింగ్ : గౌతం రాజు, నిర్మాతలు : నల్లమలుపు శ్రీనివాస్, వెంకటేశ్వర రావు, దర్శకత్వం : సురేందర్ రెడ్డి.