Don't Miss!
- News Sujana Chowdary: ఎన్నికల వేళ సుజనా చౌదరికి షాక్..! రూ.500 కోట్ల రుణంపై...
- Finance Blood Bath: వారాంతంలో కుప్పకూలిన మార్కెట్లు.. బేర్స్ చేతిలో Sensex-Nifty..
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
'బన్నీ-ది బ్లాక్ ప్రిన్స్' కే క్రేజ్
హైదరాబాద్: జులాయి మలయాళ వెర్షన్ గజ పోకిరి ఈనెల ఓనం పండుగ సందర్భంగా 18న విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం అక్కడ కోటి ఇరవై లక్షలుకు అమ్ముడైంది. ఆర్య 2, బద్రీనాధ్ చిత్రాలు కోటి రూపాయలు పైగా బిజినెస్ చేయటంతో ఈ క్రేజ్ వచ్చింది. అందులోనూ ఇలియానా అక్కడ ఎడిషినల్ ఫాక్టర్ గా భావించి బిజినెస్ జరిగిందని సమాచారం. ఇక ఈ చిత్రానికి పోటీగా ముమ్మట్టి తమన్నా (ఆగస్టు 20), మోహన్ లాల్ రన్ బేబి రన్ చిత్రం ఆగస్టు 28న విడుదల అవుతున్నాయి. అలాగే పృద్వీరాజ్, దిలీప్ చిత్రాలు కూడా ఇదే వారంలో విడుదల అయ్యే అవకాసం ఉంది.
అల్లు అర్జున్,ఇలియానా కాంబినేషన్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న రొమాంటిక్ ఎంటర్టనర్ 'జులాయి'. మొన్న గురువారం రిలీజ్ అయిన మొదటి రోజు ఈ చిత్రం వరల్డ్ వైజ్ గా 11 కోట్లు(గ్రాస్) వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో 2.5 కోట్లు(గ్రాస్)వచ్చింది. నైజాం ఏకియాలో 2.5 కోట్లు వసూలు చేసిందని ఓ ఇంగ్లీష్ దిన పత్రికకు తెలియచేసారు. అలాగే చెన్నైలో 30 దియోటర్స్ లో రిలీజ్ చేసారని,85 % వసూలు చేసిందని రాసుకొచ్చారు.
''హీరోగా నేనేం చేసినా... ఎంత పేరు తెచ్చుకొన్నా కేవలం అది దర్శకుల వల్లే. సినిమా అనేది సమష్టి కృషే అయినా... దర్శకుడి కష్టమే ఎక్కువ. 'జులాయి' విషయంలో కూడా త్రివిక్రమ్ ఎంతో శ్రమించారు''అని చెప్పారు అల్లు అర్జున్. ఇక తానిప్పటివరకు నటించిన చిత్రాలన్నింటికీ తొలిరోజు డివైడ్ టాక్ వచ్చిందని, ఏరోజైనా సినిమా హిట్ అన్న స్పందన మొదటి రోజు వినాలని ఎదురుచూశానని, ఆ బాధను జులాయి చిత్రం తీర్చిందని అల్లు అర్జున్ అన్నారు.
''ఈ రోజే ప్రేక్షకుల మధ్య కూర్చుని సినిమా చూశా. చాలా బాగుంది''అని దేవిశ్రీ ప్రసాద్ చెప్పారు. మలయాళంలో ఈనెల 18న విడుదల చేయనున్నామని, త్వరలో ప్లాటినమ్ డిస్క్ వేడుక కూడా జరుపుతామని, ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలని నిర్మాతలు డివివి.దానయ్య, రాధాకృష్ణ తెలిపారు. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, సోనుసూద్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, తులసి, ప్రగతి, హేమ తదితరులు నటిస్తున్నారు. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్.