త్రివిక్రమ్ కథ రెడీ ..జనవరినుంచే ప్రారంభం

ఈ వార్తతో 'అత్తారింటికి దారేది' తరవాత త్రివిక్రమ్ దర్శకత్వం వహించే సినిమా ఏది? హీరో ఎవరు? ఎన్టీఆర్తో చేస్తారా... లేదా? ఈ ప్రశ్నల పరంపరకు తెరపడినట్టే. ఎందుకంటే త్రివిక్రమ్ తరవాతి సినిమా అల్లుఅర్జున్తో ఖాయమైపోయింది. 'జులాయి' తరవాత వీరిద్దరి కలయికలో రూపుదిద్దుకొనే చిత్రమిదే. 'జులాయి' నిర్మాత రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు.
ఇందులో అల్లు అరవింద్ కూడా నిర్మాణ భాగస్వామిగా చేరినట్టు సమాచారమ్. కథ ఇప్పటికే సిద్ధమైందట. జనవరి నెలలో ఈ చిత్రం సెట్స్పైకి వెళ్లే అవకాశాలున్నాయి. అల్లుఅర్జున్ 'రేసుగుర్రం' తుదిదశకు చేరుకొంది. ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయనున్నారు.


Click it and Unblock the Notifications











