twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శంషాబాద్ నుంచి ‘బిజినెస్ మ్యాన్’ షురూ

    By Bojja Kumar
    |

    మహేష్‌ బాబు, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం 'బిజినెస్ మేన్" షూటింగ్ శుక్రవారం హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఆరంభమైంది. మహేష్ బాబు సరనన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఆర్.ఆర్. మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా మహేష్‌బాబు మాట్లాడుతూ.. 'ప్రేక్షకులు, అభిమానులు కావాలని కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయన్నారు. పోకిరి తర్వాత మళ్లీ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించడం ఆనందంగా ఉంది అన్నారు. దర్శకుడు పూరి మాట్లాడుతూ ఈ చిత్రంలో మహేష్‌బాబు కేరక్టరైజేషన్, ఆయన చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటాయన్నారు.

    మహేష్, పూరి కాంబినేషన్‌లో ఇంత భారీ చిత్రం నిర్మించడం ఆనందంగా ఉందని, ఆలస్యం చేయకుండా జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని చిత్ర నిర్మాత వెంకట్ తెలిపారు. ఈ నెల 10 వరకు హైదరాబాద్‌లో షూటింగ్ చేసి, 11 నుంచి డిసెంబర్ 25 వరకు ముంబై, హైదరాబాద్, విదేశాల్లో షూటింగ్ చేస్తామన్నారు. ఈ సినిమాలో ఇంకా..... ప్రకాష్‌రాజ్, సాయాజీ ఇండే, ధర్మవరపు, బ్రహ్మాజీ, రాజా మురద్, జహంగీర్‌ఖాన్ తదితరులు నటిస్తున్నారు.

    సంగీతం: థమన్ ఎస్., సినిమాటోగ్రఫి: శ్యామ్ కె.నాయుడు, ఫైట్స్: విజయ్, ఆర్ట్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్. శేఖర్, డాన్స్: దినేష్, లైన్ ప్రొడ్యూసర్: నీరజ్ శర్మ, కో-ప్రొడ్యూసర్: వి.సురేష్ ‌రెడ్డి.

    English summary
    Mahesh Babu's Business Man movie shooting started at shamshabad airport on Friday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X