Don't Miss!
- News ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
- Sports PBKS vs MI: చెలరేగిన సూరీడు... తెలుగోడు!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
రాఖీ ఆఫర్ : చెన్నైఎక్స్ప్రెస్ ఫ్రీ టికెట్!
ముంబై : షారుక్ ఖాన్-దీపిక పదుకొనె హీరో హీరోయిన్లుగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన 'చెన్నై ఎక్స్ప్రెస్' చిత్ర నిర్మాతలు ఒకరోజు సరికొత్త ఆఫర్ అమలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రాఖీ(ఆగస్టు 20) పండగను పురస్కరించుకుని ఆరోజు సినిమా చూడటానికి వచ్చిన వారు 2 టికెట్లు కొంటే ఒక టికెట్ ఫ్రీగా ఇచ్చేందుకు ప్లాన్ చేసారట. 'చెన్నై ఎక్స్ప్రెస్' రిలీజైన అన్ని థియేటర్లలో ఈ ఆఫర్ అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇలా చేయడం ద్వారా సినిమాకు పబ్లిసిటీ పెరగడంతో పాటు....ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ శాతం థియేటర్లు తరలి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ ద్వారా మంచి టాక్ జనాల్లోకి వెళితే సినిమాకు మరిన్ని లాభాలు వస్తాయని భావిస్తున్నారు.
ఈ చిత్రం పాకిస్థాన్లోని కరాచీలో కేవలం 8 స్క్రీన్లలో విడుదలైన ఈచిత్రం ఇప్పటి వరకు 40 మిలియన్ల రూపాయలు వసూలు చేసింది. ఇండియాలో కలెక్షన్ల విషయానికొస్తే....విడుదలై తొలి 10 రోజుల్లో ఈచిత్రం 181.93 కోట్ల రూపయాలు వసూలే చేసింది. తొలి వారంలో దుమ్మురేపే కలెక్షన్లు సాధించి బాక్సాపీసు వద్ద నెం.1 స్థానంలో నిలిచిన ఈచిత్రం....రెండో వారంలో 'వన్స్ ఎపానె టైం ముంబై దొబారా' చిత్రం విడుదల కారణంగా 2 స్థానానికి పడిపోయింది.
ఇప్పటి వరకు ఉన్న కలెక్షన్లను పరిగణలోకి తీసుకుంటే అత్యధిక గ్రాస్ కలెక్షన్ సాధించిన 4వ బాలీవుడ్ సినిమాగా కొనసాగుతోంది. గతంలో అమీర్ ఖాన్ నటించిన 3 ఇడియట్స్(రూ.202 కోట్లు), ఏక్ థా టైగర్(రూ. 199 కోట్లు), యే జవానీ హై దివానీ(188.57) కోట్లతో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.
షారుక్ ఖాన్, దీపిక పదుకొనె జంటగా నటించిన చెన్నై ఎక్స్ ప్రెస్ చిత్రానికి రోహిత్ శెట్టి దర్శకత్వం వహించారు. రెడ్ చిల్లీస్ ఎంటర్టెన్మెంట్స్, యూటీవీ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా మొత్తం సౌతిండియా నేపథ్యంతో సౌతిండియా బాక్సాఫీసు వద్ద కూడా సినిమాకు మంచి కలెక్షన్లు వస్తున్నాయి.