Don't Miss!
- News ఎన్నికల ప్రచారానికి నేటితో తెర: ఈ రాష్ట్రాల్లో ఎల్లుండి పోలింగ్
- Sports ఆ రూల్ వల్లే గెలిచాం- KL రాహుల్
- Automobiles క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
విజయ్ దేవరకొండతో క్రికెట్ ఆడి సందడి చేసిన ఐశ్వర్య.. వెరీ ఇంట్రెస్టింగ్
క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కేఎస్ రామారావు సమర్పణలో భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రొడక్షన్ నెం.47గా క్రియేటివ్ ప్రొడ్యూసర్ కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం 'కౌసల్య కృష్ణమూర్తి ది క్రికెటర్'. చిత్రంలో ఐశ్వర్య రాజేష్ లీడ్ రోల్ పోషించగా.. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ ముఖ్యపాత్రలు పోషించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.
ఈ సందర్బంగా వేదికపై హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ.. ''కౌసల్య కృష్ణమూర్తి నా కెరీర్లో తొలి తెలుగు సినిమా అవుతుందని ఊహించలేదు. దీనికంటే ముందే నేను విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు సైన్ చేశాను. కానీ అనుకోకుండా నా డబ్యూ మూవీ కౌసల్య కృష్ణమూర్తి అయింది.
నాపై నమ్మకముంచి 'కౌసల్య కృష్ణమూర్తి' అనే ఫిమేల్ సెంట్రిక్ సినిమాలో నన్ను భాగం చేసినందుకు గాను కెఎస్ రామారావు గారికి స్పెషల్ థాంక్స్. ఈ సమయంలో మా నాన్న గారు ఉండుంటే చాలా ఆనందపడేవారు. ఇక డైరెక్టర్ భీమినేని శ్రీనివాస రావు దర్శకత్వంలో ఈ సినిమాకు ప్రాణం పోసింది. ఆగస్టు 23న థియేటర్స్లో కలుద్దాం. నేను తమిళ్లో పెద్ద రౌడీని.. ఇప్పుడు ఆ రౌడీతో ఈ రౌడీ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో నటిస్తున్నాము'' అని చెబుతూ ఫన్నీ వాతావరణం క్రియేట్ చేసింది ఐశ్వర్య రాజేష్. అంతేకాదు వేదికపై విజయ్ దేవరకొండతో క్రికెట్ ఆడి సందడి చేసింది ఐశ్వర్య.