twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మొన్న బండ్ల గణేష్, నేడు సి. కళ్యాణ్.... టార్గెట్ ఎవరు?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: టాలీవుడ్ ను శాసిస్తున్న పన్నెండు మంది నిర్మాతల్లో తాను లేనని నిర్మాత సి. కళ్యాణ్ అన్నారు. మరి కొద్ది రోజుల్లో వారూ ఉండరని నిర్మాత సి. కళ్యాణ్ చెప్పుకొచ్చారు. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో నటి చార్మి ప్రధాన పాత్ర పోషిస్తున్న జ్యోతిలక్ష్మి సినిమా ఫస్ట్ లుక్ ను నిర్మాత కళ్యాణ్ లాంఛ్ చేశారు. ఈ సందర్భంగా సి. కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేసారు.

    ఇంతకు ముందు బండ్ల గణేష్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసారు. టాలీవుడ్లో ప్రముఖ నైజాం డిస్టిబ్యూటర్, నిర్మాత అయిన ఓ బడా నిర్మాత, మరికొందరు బడా నిర్మాతలు చేతులు కలిసి తమకు ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటూ పరిశ్రమను శాంసిచే ప్రయత్నం చేస్తున్నారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అందులో బండ్ల గణేష్ పేరుకూడా ఉన్నట్లు వార్తలు రావడంతో అతను ఖండించారు.

    C Kalyan speech @ Jyothi Lakshmi

    ఈ వార్తల నేపథ్యంలో బండ్ల గణేష్ ఆ మద్య వివరణ ఇచ్చారు. సదరు నిర్మాతల గ్రూఫులో నేను లేనని, మీడియా ఛానళ్లపై తాను ఎలాంటి వివక్ష చూపడం లేదని, మీడియా మిత్రులంతా నా ఫ్యామిలీ మెంబర్స్ లాంటి వారు అని స్పష్టం చారు. ఈ మేరకు ఓ పబ్లిక్ స్టేట్మెంటు కూడా విడుదల చేసారు.

    ‘గుడ్ ఈవినింగ్ సర్. నేను బండ్ల గణేష్. మీడియావారంతా నా ఫ్యామిలీ మెంబర్స్ లాంటి వారు. మీడియాకు వ్యతిరేకంగా నేను కొన్ని చర్యలకు పాల్పడుతున్నట్లు వార్తల్లో విన్నాను. అందులో ఏ మాత్రం నిజం లేదు. మీడియాకు వ్యతిరేకంగా ఉన్న కొంతమంది నిర్మాతల గ్రూఫులో నేను ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అందులో నిజం లేదు. ఆ గ్రూఫులో నేను లేను. మీడియా సహకారం వల్లనే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను. నటుడిగా, నిర్మాతగా మీడియా వారు నాకు ఎంతో సహకరించారు. అలాంటి వారికి నేను ఎప్పుడు వ్యతిరేకంగా పని చేయను' అని వివరణ ఇచ్చారు.

    English summary
    Check out producer C Kalyan speech at Jyothi Lakshmi movie first look launch.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X