Don't Miss!
- Sports సూపర్ సండే: సునామీ సన్రైజర్స్ను ఢీకొట్టేదెవరు: నెక్స్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇవే
- News గంటాకు సీటు ఖరారు - టీడీపీ తుది జాబితా విడుదల, లిస్టులో..!!
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
‘కెమెరామెన్ గంగతో..’పై కన్నింగ్ ప్లాన్.. చీప్గా కొట్టేద్దామనే!
హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం 'కెమెరామెన్ గంగతో రాంబాబు'. గబ్బర్ సింగ్ చిత్రం ఓవర్సీస్లో భారీ కలెక్షన్ సాధించిన నేపథ్యంలో ఈ చిత్రానికి భారీ అమౌంట్ చెల్లించి దక్కించుకోవడానికి ముందుకు వచ్చాయి ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటింగ్ ఏజెన్సీస్. ఓ డిస్ట్రిబ్యూటింగ్ సంస్థ దీనికి ఏకంగా రూ. 4.5 కోట్లు కోట్ చేశాయి.
అయితే...ఇటీవల పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'దేవుడు చేసిన మనుషులు' చిత్రం డిజాస్టర్ కావడంతో కన్నింగ్ ప్లాన్ వేసిన సదరు సంస్థ దీన్ని సాకుగా చూపి కేవలం రూ. 2.5 కోట్లు మాత్రమే ఇస్తామని పేచీ పెట్టింది. చీప్ గా పవన్ కళ్యాణ్ సినిమా రైట్స్ దక్కించుకుని కోట్లు వెనకేసుకుందామని స్కెచ్ వేసింది. ఇతర డిస్ట్రిబ్యూటర్లు ఎవరూ కూడా ఈచిత్రాన్ని తీసుకోకుండా పక్కాగా ప్రణాళిక రచించింది.
ఈ విషయాన్ని గ్రహించిన 'కెమెరామెన్ గంగతో రాంబాబు' నిర్మాత డివివి దానయ్య.....వాళ్ల అంచనాలు తలక్రిందులు చేస్తూ షాక్ ఇచ్చారు. యూఎస్, ఓవర్సీస్లో తానే స్వయంగా ఈ చిత్రాన్ని విడుదల చేసుకుంటానని ప్రకటించారు. దీంతో అత్యాశకు పోయిన ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు అవాక్కయ్యారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తమన్నా జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్, శేఖర్, ఫైట్స్: విజయ్, స్టిల్స్: మాగంటి సాయి, కో డైరెక్టర్: విజయరామ్ ప్రసాద్, నిర్మాణం యూనివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డివివి దానయ్య, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్.