Don't Miss!
- News పవన్ చేతిలో జాతీయ జెండా.. ! పిఠాపురంలో కోడ్ ఉల్లంఘన ?
- Sports T20 వరల్డ్ కప్కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Automobiles వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి వీడియో
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
భయపడాల్సిన పనిలేదు : మనీషా కొయిరాలా భరోసా
కోల్కాతా : కేన్సర్ రాగానే భయపడిపోవాల్సిన పనిలేదని, కేన్సర్కి ఆన్సర్ ఉందని మనీషా కొయరాలా చెప్పుకొచ్చింది. తాము కేన్సర్ను జయించినప్పుడు మిగతావారు మాత్రం ఎందుకు జయించలేరు? అంటూ కేన్సర్ బాధితుల్లో అవగాహన పెంచేందుకు ఆమె నడుంబిగించారు. ఆమెతో పాటు మరో కేన్సర్ బాధితుడు క్రికెటర్ యువరాజ్ సింగ్ కూడా ఈ సదస్సు లో పాల్గొన్నారు. "ప్రతిజ్ఞ: కేన్సర్ అపోహలు, నిజాలు'' పేరిట ఈ కార్యక్రమం జరిగింది.
ఈ మహమ్మారి బారి నుంచి బయటపడినవారిని 'కేన్సర్ సర్వైవర్'గా వ్యవహరించడం తనకు నచ్చదని మనీషా పేర్కొంది. ఆమె తనను తాను 'కేన్సర్పై పోరాడిన యోధురాలు'గా అభివర్ణించుకుంది. "కేన్సర్ అంటేనే మరణం అనే అపవాదు ఉం ది. కానీ, అది సరికాదు. కేన్సర్తో బాధపడి చికిత్స చే యించుకుని సరైనవారు నాకు చాలా మంది తెలుసు. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొని పోరాడదాం'' అని ఆ మె పిలుపునిచ్చారు.
ఒక ఫైవ్స్టార్ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమానికి కేన్సర్ పేషెంట్లతో పాటు, నగరంలో ని వైద్యులు, బెంగాలీ సినీ ప్రముఖులు, గాయకులు, ఫ్యాషన్ డిజైనర్లు, క్రీడాకారులందరూ హాజరై కేన్సర్పై అవగాహన పెంచే ప్రయత్నం చేశారు. అయితే.. యు వీ, మనీషా మాట్లాడుతున్నప్పుడు మాత్రం ఆహూతు లు మరింత శ్రద్ధగా విన్నారు. యువరాజ్ తామిద్దరినీ ఆశకు, ధైర్యానికి చిహ్నాలుగా అభివర్ణించుకున్నాడు.
కేన్సర్ ఏ దశలో బయటపడిందన్న దానితో సంబంధం లేకుండా.. ధైర్యాన్ని కూడగట్టుకుని దానితో పోరాడాలని యువీ సూచించాడు. మనలో ఆ ధైర్యం ఉండటంతోపాటు, కుటుంబసభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల సహకారం కూడా ఉంటే మరింత ఉపయోగమని వివరించాడు. మేం జయించగలిగినప్పుడు.. మీరూ జయించగలరు'' అని వీరు నినదించారు.