Just In
- 1 hr ago
మెగా హీరోయిన్ ప్రాణాలకు ముప్పు: ఏకంగా పోలీసులకే వార్నింగ్ కాల్స్.. షాక్లో సినీ పరిశ్రమ!
- 1 hr ago
నరాలు కట్ అయ్యే రూమర్.. అగ్ర దర్శకుడితో రామ్ చరణ్, యష్, ఇక ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వాల్సిందే!
- 1 hr ago
ప్రభాస్ ‘సలార్’లో విలన్గా సౌతిండియన్ స్టార్ హీరో: ఆ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ యూటర్న్
- 2 hrs ago
సావిత్రి మంచిదే అయితే ఎందుకలా చచ్చింది.. అలా చేయడమే తప్పా: షకీలా సంచలన వ్యాఖ్యలు
Don't Miss!
- Sports
స్మిత్ను ఎందుకు వదిలేశారు?.. వార్నర్ కన్నా స్టీవ్ పెద్ద నేరస్థుడు: ఇయాన్ చాపెల్
- Automobiles
ఒక ఛార్జ్తో 130 కి.మీ.. డ్రైవింగ్ లైసెన్స్ అవసరమే లేని కొత్త ఒకినవ స్కూటర్
- News
సుప్రీంకోర్టులో ఏపీ పంచాయతీ- సర్కారు అప్పీలు-ఎస్ఈసీ కేవియట్- తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
- Finance
హీరో మోటోకార్ప్ అరుదైన ఘనత, షారూక్ ఖాన్ చేత 10కోట్లవ యూనిట్
- Lifestyle
మ్యారెజ్ లైఫ్ లో మీ భాగస్వామి ఇష్టపడే గాసిప్స్ ఏంటో తెలుసా...!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
‘పికె’ చిత్రం నిలిపి వేయాలని సుప్రీం ఆదేశాలు?
హైదరాబాద్: అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం ‘పికె'పై పలు పిటీషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దేశవ్యాప్తంగా నిలిపివేయాలని కొందరు ఆలహాబాద్ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సినిమాలో ప్రత్యేకించి హిందూ దేవుళ్లనే టార్గెట్ చేసారని, హిందూదేవుళ్లపై సెటైర్లు వేసారంటూ ఆ చిత్ర దర్శకుడిపై కేసులు కేసులుపెట్టారు.
సినిమాలో కొన్ని సంభాషణలు హిందువుల్ని కించపరిచేలా ఉన్నాయని ముఖ్యంగా ‘‘భయపడే వాళ్లే దేవాలయాలకు వెళ్తుంటారు'' అనే డైలాగు హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని లక్నోకు చెందిన హిందూ ఫ్రంట్ ఫర్ జస్టిస్ అనే సంస్థ పిల్ను దాఖలు చేసింది.

కాగా.... సినిమాపై తీర్పు తీసుకునేవరకూ పీకే చిత్రాన్ని ఇండియాలో ఎక్కడా ప్రదర్శించకూడదని సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ పిటిషన్ను కోర్టు మంగళవారానికి వాయిదా వేసినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజం ఎంతో తేలాల్సి ఉంది. హైదరాబాద్ లో అయితే టిక్కెట్స్ విక్రయిస్తున్నారు.
‘పికె' చిత్రం విషయానికొస్తే....అమీర్ ఖాన్, అనుష్క శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈచిత్రాన్ని రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించారు. రాజ్ కుమార్ హిరానీ, విధు వినోద్ చోప్రా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం విడుదలైన రోజే హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం వసూళ్లు 200 కోట్లకు చేరువయ్యాయి.