Don't Miss!
- Sports ముక్కలవుతున్న ముంబై.. హార్దిక్ను విమర్శిస్తూ నబీ పోస్ట్
- News జగన్ పై దాడి ఘటనలో మరో టర్నింగ్ ! వడ్డెర సంఘాల ఎంట్రీ..
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
తప్పతాగి నానా యాగీ: నటుడు ఫిష్ వెంకట్పై కేసు నమోదు
తెలుగు సినీ నటుడు ఫిష్వెంకట్పై కొత్తగూడెంలో కేసు నమోదైంది.తప్పతాగి హంగామా చేసి ఓ కుటుంబంతో తగాదా పడినందుకు ఈ కేసు నమోదైంది.
కొత్తగూడెం క్రైం: తెలుగు సినీ నటుడు ఫిష్వెంకట్పై కేసు నమోదైంది. మద్యం తాగి నానా యాగీ చేస్తూ ఓ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతూ వస్తున్న ఆయనపై పోలీసులు చివరకు కేసు పెట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని ఏ పవర్హౌజ్ బస్తీలో హంగామా చేశాడు.
ఈ నెల 4వ తేదీ అర్ధరాత్రి మద్యంతాగి గొడవ చేశాడు. ఈ విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. దాంతో ఆయనను పిలిపించి సున్నితంగా మందలించి వదిలేశారు. అయినా అతని తీరు మారలేదు.
కూతురి ఇంటికి వెళ్లి...
సినిమాల్లో విలన్ పక్కన చిన్నచిన్న వేషాలు వేసే నటుడు వెంకట్కు ఒక కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. తన కూతురు కొత్తగూడెంలోని ఏ పవర్హౌజ్ బస్తీకి చెందిన మెడికల్షాపు లో పనిచేసే వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించాడు.
గొడవ తీవ్రరూపం...
వెంకట్ కూతురు నాలుగేళ్లుగా ఏ పవర్హౌజ్ బస్తీలో నివాసం ఉంటోంది. వారి ఇంటికి పక్కనే ఉన్న వేముల రాజేశం, వేముల ఉపేంద్ర, వేముల ప్రసాద్లతో వివాదం ఏర్పడింది. ఆ గొడవ తీవ్ర రూపం దాల్చింది. అది పోలీసుల దాకా వెళ్లింది.
Recommended Video
కొత్తగూడెం వచ్చి....
గత నెల 30వ తేదీన వెంకట్తో పాటు ఎనిమిది మంది కొత్తగూడెం వచ్చారు. వేముల ప్రసాద్ ఇంటి ఎదుట అర్థరాత్రి వరకు హంగామా సృష్టించారు ఈ విషయాన్ని ప్రసాద్ వన్టౌన్ పోలీసుల దృష్టికి తీసుకువెళ్లగా అక్కడకు చేరుకున్న ఎస్ఐ తిరుపతి సర్ది చెప్పి పంపించారు. మళ్లీ ఈనెల నాలుగున అతిగా మద్యం తాగి ఫిష్ వెంకట్ప్రసాద్ తల్లి ఉ పేంద్రతో దురుసుగా ప్రవర్తించి, తిట్లపురాణం అందుకున్నారు.
మరోసారి మందలించి...
బాధితులు ఆ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. దాంతో వారు మందలించి వదిలేశారు. తొమ్మిదిన తేదీన ఫిష్వెంకట్, అతడి ఇద్దరు కుమారులతో పాటు మరో కొంతమందితో వచ్చి మళ్లీ వేముల ప్ర సాద్, ఉపేంద్ర, రాజేశంపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. దాంతో వారు వన్టౌన్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు ఫిష్ వెంకట్పై కేసునమోదు చేశారు.