Don't Miss!
- News సచివాలయ ఉద్యోగులకు ఎన్నికల విధులపై కీలక నిర్ణయం..!!
- Lifestyle ఈ రోజు రాశి ఫలాలు: ఓ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి..సమస్యలు పెరుగుతాయి
- Finance Gold Rate: మిసైల్ వేగంతో పెరిగిన పసిడి.. నిన్న పడింది నేడు పుంజుకుంది..
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అలాంటి తిరుపతికి ఎందుకు వెళ్ళాలి.. హీరో సూర్య తండ్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. కేసు నమోదు
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఫ్యామిలీ మరోసారి వివాదాస్పద వార్తల్లో హాట్ టాపిక్ గా మారింది. హీరో సూర్య ఆయన తమ్ముడు కార్తీ స్టార్ హీరోలుగా సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు దక్కించుకుంటున్న విషయం తెలిసిందే. అయితే వారి తండ్రి శివకుమార్ మాత్రం తరచు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఈసారి ఆయన టీటీడీపై కామెంట్ చేయడం వివాదంగా మారింది.
పొలీస్ కేసు..
తమిళ్ చిత్ర పరిశ్రమలో సీనియర్ నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శివకుమార్ పై పోలీస్ కేసు నమోదు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంపై ఊహించని విధంగా కామెంట్ చేయడంతో దేవస్థానం అధికారులు సీరియస్ అయ్యారు. ఆయనతో పాటు మరో ఎనిమిది మందిపై కూడా అధికారులు పోలీస్ కేసు నమోదు చేయడం హాట్ టాపిక్ గా మారింది.
వివధాల్లోకి..
ఒక వైపు కొడుకులు తండ్రి గర్వపడేలా సినిమాలు చేస్తూ ఉంటే శివ కుమార్ మాత్రం సూర్య కార్తీలను అనుకోకుండా ఇబ్బందికి గురి చేస్తున్నాడు. సూర్య, కార్తీలకు తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ కో ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. వారు చాలా వరకు మీడియాకు దగ్గరగా ఉంటారు. తరచు శివకుమార్ చేసే కామెంట్స్ పై వారు మీడియా నుంచి ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తోంది.
దర్శనాలపై కామెంట్..
ఈ సారి శివకుమార్ తిరుమల దర్శనాలపై కామెంట్ చేశారు. డబ్బు ఉన్నవారికే దర్శనాలు కల్పిస్తారని. గెస్ట్ హౌజ్ లు కూడా అక్కడ డబ్బుతో ముడిపడి ఉంటుందని సామాన్యులకు కనీసం దర్శనం కల్పించకుండా తోసేస్తారు అని శివకుమార్ మండిపడ్డారు. ఇక అలాంటి ఆలయంలోకి ఎందుకు వెళ్లాలని కూడా కామెంట్ చేయడంతో ఒక్కసారిగా మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచారు.
Recommended Video
అసత్య ప్రచారాలు..
శివ కుమార్ చేసిన కామెంట్స్ పై తమిళనాడుకు చెందిన తమిళ్ మయ్యన్ అనే భక్తుడు టీటీడీకి ఈ మెయిల్ ద్వారా సమాచారం అందించారు. దీంతో శివకుమార్ పై పోలీస్ కేసు నమోదు చేసినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. అలాగే సోషల్ మీడియాలో ఆలయంపై దుష్ప్రచారం చేస్తున్న 8మందిపై కూడా కేసు నమోదు చేశామని, శ్రీవారి దర్శనాలు రద్దు అంటూ అసత్య ప్రచారం చేసిన రెండు పత్రికలపై కూడా కేసు నమోదు చేసినట్లు అధికారులు వివరణ ఇచ్చారు.