Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మనోభావాలు దెబ్బతీసారు: 'గుంటూరు టాకీస్' సినిమాపై కేసు
హైదరాబాద్ :నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రవీణ్ సత్తార్ రూపొందించిన గుంటూరు టాకీస్ చిత్రం వారం క్రితం విడుదలై ఓ వర్గాన్ని బాగా ఆకట్టుకుంటూ భాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో వికలాంగుల మనోభావాలు దెబ్బతీసేలా సినిమా తీశారంటూ కేసు నమోదైంది.
గుంటూరు టాకీస్ ఫోటో గ్యాలెరీ
గుంటూరు టాకీస్ సినిమా దర్శక, నిర్మాతలపై తెలంగాణ వికలాంగుల హక్కుల సమితి నాయకులు ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం సమితి నాయకులు దుండి సైదులు, బానాల వెంకటయ్య మాట్లాడుతూ సినిమాలో పలుమార్లు వికలాంగుల మనోభావాలు దెబ్బతినేవిధంగా వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు.
సినిమా దర్శక, నిర్మాతలపై పీడబ్ల్యూడీ యాక్ట్ 1995 ప్రకారం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వికలాంగుల హక్కుల సమితి నాయకులు మహేశ్, లక్ష్మణ్, అమృత, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.