Don't Miss!
- News తెర మీదకు వివేకానందరెడ్డి రెండో భార్య..వీడియో వైరల్
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
సి. కళ్యాణ్ పై బిగుస్తున్న ఉచ్చు, మూడు పిఎస్ ల్లో కేసులు
మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్తో సంబంధాల విషయంలో తెలుగు సినీ నిర్మాత సి. కళ్యాణ్పై ఉచ్చు బిగుస్తోంది. కళ్యాణ్పై పాత కేసులను పోలీసులు తిరగదోడుతున్నారు. హైదరాబాదులోని కూకట్పల్లి, రాయదుర్గం, మియాపూర్ పోలీసు స్టేషన్లలో ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ భూదందాలకు చెందిన కేసులేనని తెలుస్తోంది. భానుతో కలిసి కళ్యాణ్ హైదరాబాదులో, హైదరాబాదు పరిసరాల్లో భూదందాలు చేసినట్లు తెలుస్తోంది. మరో నిర్మాత శింగనమల రమేష్పై కూడా ఉచ్చు బిగిస్తోంది. తాజాగా, మరో నిర్మాత, హాస్యనటుడు గణేష్ పేరు కూడా వెలుగులోకి వచ్చింది.
కళ్యాణ్ ముఠా 60కి పైగా సెటిల్మెంట్లు చేసినట్లు పోలీసులు గుర్తించారని అంటున్నారు. కళ్యాణ్ భూదందాలకు చెందిన చిట్టాను పోలీసులు విప్పారని అంటున్నారు. సినీ రంగంలో భాను కిరణ్, కళ్యాణ్ బినామీ ఆస్తులు 40 కోట్ల రూపాయలకు పైగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కళ్యాణ్ను పోలీసులు ఇప్పటికే నాలుగు సార్లు విచారించినట్లు సమాచారం. కళ్యాణ్ను ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదని అధికారులు ఆరా తీస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కళ్యాణ్ అస్తులపై ఆదాయం పన్ను శాఖ కూడా ఆరా తీస్తోంది. వివిధ ప్రాంతాల్లో కళ్యాణ్ పేర ఉన్న భాను కిరణ్ బినామీ ఆస్తులను కూడా గుర్తించినట్లు సమాచారం.