Don't Miss!
- Finance Elon Musk: ఎలోన్ మస్క్ పర్యటన వాయిదా..ఎందుకంటే..!
- News గజలక్ష్మీ యోగం.. సరిగ్గా ఐదు రోజుల్లో వీరికి డబ్బే డబ్బు
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
బడా(దిల్ రాజు, అల్లు.., సురేష్ బాబు...)నిర్మాతలను సిబిఐ ఎంక్వైరీ చెయ్యాలి...?
చిన్న నిర్మాత మండలి అధ్యక్షడు నట్టి కుమార్ పెద్ద నిర్మాతలపై విరుచుకు పడ్డారు. 'ఐదారుగురు(దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు, అశ్వినీదత్......) పెద్దమనుషుల చేతిలో సినీ పరిశ్రమ వుంది. అగ్ర నిర్మాతలుగా చెలామణి అవుతున్న వారు సర్వీస్ టాక్స్, వినోదపు పన్ను కట్టకుండా తప్పుడు లెక్కలు చూపిస్తూ ప్రభుత్వానికి రావాల్సిన కోట్లాది రూపాయలను కొల్లగొడుతున్నారు. అలాంటి వారు 45 రోజుల్లో అన్ని పన్నులు కట్టాలి. లేకుంటే సమాచార హక్కు చట్టం కింద అన్ని వివరాలు సేకరించి వారిపై కోర్టులో కేసు వేస్తా. సీబీఐ విచారణ జరిపించాల్సిందిగా కోరతా" అని నిర్మాత నట్టికుమార్ హెచ్చరించారు. న్యాయపోరాటం చేసి వారి భరతం పడతానని హెచ్చరించారు. గురువారం తన పుట్టిన రోజు సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడారు.
తాను కొన్ని థియేటర్లను లీజుకు తీసుకొని వాటిలో కొన్ని సౌకర్యాలు కల్పించాను. ఇప్పుడు ఆ థియేటర్లలో సినిమాల ప్రదర్శనకు బడా నిర్మాతలు ఒప్పుకోవడం లేదు. దీనివల్ల ఎగ్జిబిటర్లు బాధపడుతున్నారు. ఆ థియేటర్ల మరమ్మతుల కోసం నేను వెచ్చించిన మొత్తాన్ని తిరిగి ఇస్తే నాకు న్యాయం చేసినట్లవుతుంది. ఈ విషయంలో సదరు బడా నిర్మాతలు నాపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. అందుకే నేను న్యాయ పోరాటం చేద్దామనుకుంటున్నాను. నేను ఒక సెక్టార్ ఛైర్మన్ ని. అయినా తగిన గౌరవం దక్కడం లేదు. అంతవరకు సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నాను" అన్నారు.