Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
వెన్ను పోటు పర్వం రిపీట్, బాబు బ్రహ్మీ అయిపోయాడు... వర్మ సెటైర్లు
Recommended Video
తెలుగు దేశం పార్టీ ఏపీలో ఓటమి పాలవ్వడం, చంద్రబాబు నాయుడుకు ముఖ్యమంత్రి కుర్చీ దూరం కావడంపై రాంగోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా తనదైన శైలిలో సెటైర్లు పేలుస్తూనే ఉన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డ దగ్గర నుంచి ఆయన ట్విట్టర్ ద్వారా చంద్రబాబు గురించి ఏదో ఒక పోస్టు పెడుతూనే ఉన్నాయి.
తాజాగా ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో రాంగోపాల్ వర్మ స్పందించారు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి జగన్ నవ్వు ఆపుకోలేకపోతున్నారని, చంద్రబాబు కమెడియన్ బ్రహ్మానందంలా మారిపోయారు కాబట్టే ఆయన అలా నవ్వుతున్నారు అంటూ ట్వీట్ చేశారు.
I am so loving to see @ysjagan laughing so uncontrollably whenever @ncbn speaks which basically means CBN has become brahmanandam in the assembly
— Ram Gopal Varma (@RGVzoomin) June 20, 2019
వెన్నుపోటు పర్వ రిపీట్ అవుతోంది. అప్పట్లో ఎన్టీఆర్ విదేశాలకు వెళ్లినపుడు నాదేండ్ల భాస్కర్ రావు వెన్నపోటు పొడిచారు. అలాగే చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్లినపుడు టీడీపీ నేతలు ఆయన్ను వెన్నుపోటు పొడిచారు అంటూ... మరో ట్వీట్ చేశారు.
History keeps on repeating itself ...The way Nadendla Bhasker Rao back stabbed NTR when he was abroad now the TDP leaders have backstabbed CBN when he is abroad
— Ram Gopal Varma (@RGVzoomin) June 21, 2019
రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం విడుదల ఇబ్బందులను ఎదుర్కొంది. ఈ చిత్రం చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉంది కాబట్టే ఆ పార్టీ శ్రేణులు కావాలనే అడ్డంకులు సృష్టించాయనే ఆరోపణలు అప్పట్లో వినిపించాయి. అయితే జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వర్మ తన సినిమాను సాఫీగా రిలీజ్ చేసుకోగలిగాడు.
వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏపీ రాజధాని అమరావతి, విజయవాడలో కడప జిల్లాకు చెందిన రెడ్లు ఎక్కువగా కనిపిస్తుండటంతో... త్వరలో తాను 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అనే సినిమా తీయబోతున్నట్లు వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ త్రానికి సంబంధించిన పూర్తి వివరాలు మరికన్ని రోజుల్లో వెల్లడిస్తానని తెలిపారు