Don't Miss!
- Finance Gold Rate: పిచ్చెక్కిస్తున్న పసిడి ధరలు.. నేడు మళ్లీ పెరుగుదల.. రూ.4,900 అప్..
- Sports ధోనీకి కోపం వచ్చింది.. భయపడిన కెమెరామెన్ Video
- News కేసీఆర్ తో టచ్ లో ఉన్న కాంగ్రెస్ ముఖ్యులెవరు..!!
- Lifestyle పుచ్చకాయ జ్యూస్ లో ఈ ఒక్కటి కలిపి తాగితే చాలు వేసవి ఆరోగ్య సమస్యలు బలాదూర్..మీ శరీరానికి శాంతం..ఉపశమనం
- Automobiles ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
సీసీసీలో ముసలం.. కొందరికే నిత్యావసర సరకులు.. చిరంజీవి దృష్టికి సమస్యలు!!
కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్లో ఎంతో మంది ఉపాధిని కోల్పోయారు. ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందిన వారు దిక్కు తోచని స్థితిలో పడిపోయారు. షూటింగ్లు జరిగితే గానీ పొట్ట నిండని దినసరి కార్మికులు, సినీ శ్రామికులు అయోమయానికి గురయ్యారు. అలాంటి స్థితిలో మెగాస్టార్ చిరంజీవి కొటి రూపాయల విరాళంతో సినీ కార్మికులను ఆదుకునేందుకు ఓ ట్రస్ట్ను ఏర్పాటు చేశారు. కరోనా క్రైసిస్ ఛారిటీ అని ఓ సంస్థను స్థాపించి విరాళాలు సేకరించాడు.
ఏడుగురు సభ్యుల బృందం..
సినీ కార్మికులను ఆదుకునేందుకు పెట్టిన సీసీసీ బాధ్యతలను నిర్వహించడానికి తమ్మారెడ్డి భరద్వాజ వంటి వారిని నియమించారు. బెనర్జీ, ఎన్ శంకర్, మెహర్ రమేష్ ఇలా ఓ ఏడుగురి సభ్యుల బృందంతో సీసీసీని ముందుకు నడిపిస్తున్నారు.వీరి సారథ్యంలో మొదటి విడత సరుకుల పంపిణీ ఘనంగా జరిగింది.
రెండో విడత..
తాజాగా రెండో విడత పంపిణీ విషయమై అంతా చర్చించారు. ఆ మేరకు నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని నిర్ణయించారు. అయితే ఈ సారి మాత్రం ఆ విషయంలో కాస్త గందరగోళం నెలకొంది. అవసరం లేని వారు సరుకులు తీసుకోవద్దని ముందే విన్నవించిన సంగతి తెలిసిందే.
అందరికీ ఇవ్వడం లేదు..
రెండో విడతలో భాగంగా నిత్యావసరాలు కొందరికే పంపిణీ చేస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిని నిరసిస్తూ కార్మికులు ఇందిరానగర్ ప్రాంతంలోని కార్యాలయాల వద్ద బుధవారం ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. కార్మిక యూనియన్ల ద్వారా అందిస్తున్న ఈ కార్యక్రమంలో ఈ గొడవలు అందర్నీ షాక్కు గురి చేస్తున్నాయి.
Recommended Video
చిరంజీవి దృష్టికి..
అందరికి ఇవ్వలేమని, కొందరు సభ్యులకు మాత్రమే ఇస్తామని సీసీసీ పేర్కొనడం, కేవలం సగం మందికే సరుకులు ఇస్తామని చెప్పడంతో యూనియన్ నాయకులకు కూడా ఏమిచేయాలో అర్థం కాలేదు. విషయం తెలుసుకున్న తెలుగు సినీటీవీ ప్రొడక్షన్ అసిస్టెంట్స్ యూనియన్, తెలుగు లైట్మెన్ యూనియన్, తెలుగు సినీ స్టూడియోవర్కర్స్ యూనియన్లకు చెందిన సభ్యులు బుధవారం కార్యాలయాలను ముట్టడించి ఆందోళనకు దిగారు. ఈ సమస్యను చిరంజీవి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో సభ్యులు శాంతించారు. మరి ఈ వివాదం ఇక్కడితో ముగుస్తుందో లేదో చూడాలి.