100 మంది హీరోలతో ఒకే వేదికపై!

సీసీఎల్ మొదటి సీజన్లో నాలుగు చిత్ర రంగాలకు చెందిన జట్లు టైటిల్ కోసం తలపడితే, ఈ రెండవ సీజన్లో బెంగాలీ, మలయాళీ చిత్ర రంగాల నుంచి అదనంగా మరో రెండు జట్లు పాల్గొనబోతున్నాయి. బెంగాల్ టైగర్స్ జట్టును బోనీకపూర్, శ్రీదేవిలు సొంతం చేసుకోగా, కేరళ స్ట్రయికర్స్ జట్టును మోహన్లాల్, లిజీ ప్రియదర్శన్లు సంయుక్తంగా సొంతం చేసుకున్నారు. తొలి మ్యాచ్ ముంబయ్ హీరోస్, గత ఛాంపియన్ చెన్నయ్ రైనోస్ జట్ల మధ్య జనవరి 13న షార్జాలో జరుగనుంది. ప్రాంతీయ భాషా చిత్రాల తారలను దేశవ్యాప్త ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు, జాతీయ స్థాయి తారలను ప్రాంతీయ ప్రేక్షకులకు మరింత చేరువ చేసేందుకు అనువైన వేదికగా సీసీఎల్ పేరు సంపాదించుకుంది.


Click it and Unblock the Notifications











