Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
హాట్ టాపిక్ :అపూర్వ లఖియా... పరుగుల తుఫాన్
దుబాయ్ :అపూర్వ లఖియా దర్శకత్వం వహించిన 'తుఫాన్' చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది కానీ... ఆయన సృష్టించిన పరుగుల తుఫాన్ మాత్రం సూపర్హిట్టయింది. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్-4)లో భాగంగా శనివారం దుబాయ్లో ముంబై హీరోస్, తెలుగు వారియర్స్ జట్ల మధ్య మ్యాచ్ సాగింది. ముంబై జట్టు 37 పరుగులకు 7 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి అడుగుపెట్టాడు అపూర్వ లఖియా. జట్టు 50 పరుగులు కూడా చేస్తుందో లేదో అనుకొంటున్న దశలో మైదానంలో పరుగుల తుఫాన్ సృష్టించాడు.
కేవలం 30 బంతుల్లోనే 69 పరుగులు చేసి నాటౌట్గా నిలిచారు. ఆయన ఆట మ్యాచ్కే హైలెట్గా నిలిచింది. అపూర్వకి ఇంద్రనీల్ చక్కటి సహకారం అందించారు. ఆయన 16 పరుగులతో నాటౌట్గా నిలిచారు. ఈ ఇద్దరి భాగస్వామ్యంతో ముంబయి జట్టు 127 పరుగుల స్కోరు సాధించింది. అపూర్వ ఆటలో మూడు బౌండరీలతో పాటు, ఆరు సిక్సర్లు ఉండటం విశేషం.
ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్లో అన్ని విభాగాల్లోనూ పైచేయి సాధించి విజయం అందుకొంది తెలుగు జట్టు. ప్రిన్స్, సుధీర్బాబు, సచిన్ జోషి, అఖిల్, ఆదర్శ్ తదితర తారలు బ్యాట్తో మెరుపులు మెరిపించారు. రఘు, నందకిషోర్ బాల్తో మేజిక్ చేశారు. దీంతో ఆరు వికెట్ల తేడాతో ఇంకా రెండు ఓవర్లు మిగిలివుండగానే తెలుగు వారియర్స్ జట్టు విజయ పతాకం ఎగరేసింది. ఈసారి కప్పు గెలవడమే తమ లక్ష్యమని చాటి చెప్పింది.