Don't Miss!
- News టీడీపీ అభ్యర్దుల మార్పు, ఎవరెక్కడ - రఘురామ పై తాజా నిర్ణయం..!!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
కవల పిల్లలకు జన్మనిచ్చిన హాట్ హీరోయిన్
బాలీవుడ్ హాట్ హీరోయిన్ సెలీనా జైట్లీ శనివారం ఇద్దరు మగ కవలలకు జన్మినిచ్చింది. దుబాయ్లోని ఓ ఆసుపత్రిలో ఆమెకు డెలివరీ జరిగటింది. అప్పుడే వీరికి పేర్లు కూడా పెట్టేసారు. ఒకరికి విన్స్టన్, మరొకరికి విరాజ్ అని పేరు పెట్టినట్లు సెలీనా భర్త పీటర్ హాగ్ వెల్లడించారు. తల్లి, బిడ్డలు క్షేమంగా ఉన్నారని, ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నానని ఆయన చెప్పారు. దుబాయ్లో వ్యాపారం చేస్తున్న ఆస్ట్రేలియా దేశస్తుడు పీటర్ హాగ్ను సెలీనా జులై 23, 2011లో పెళ్లాడిన విషయం తెలిసిందే. త్వరలో తాము ఇండియా వస్తామని పీటర్ హాగ్ ప్రకటించారు.
పెళ్లికి ముందే రెండేళ్లుగా సెలీనా-పీటర్ హాగ్ మధ్య ప్రేమాయణం నడుస్తోంది. 2010 దుర్గా పూజ సందర్భంగా ఈ ఇద్దరి నిశ్చితార్థం కూడా జరిగింది. పెళ్లి విషయాన్ని అందరికీ చెప్పి గ్రాండ్గా చేసుకుంటుందని అభిమానులు ఆశించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా రహస్యంగా పెళ్లి చేసుకుని శోభనం కూడా కానిచ్చేసి..తీరిగ్గా నెల రోజుల తర్వాత విషయాన్ని బయట పెట్టింది అమ్మడు.
మోహన్బాబు తనయుడు మంచు విష్ణు తొలిసి సినిమా 'సూర్యం' ద్వారా అప్పట్లో టాలీవుడ్కు పరిచయం అయిన ఈ సెక్సీ తార ఆ సినిమా పరమ ప్లాపు కావడంతో మళ్లీ తెలుగు తెరవైపు చూడలేదు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే మంచు విష్ణు కూడా ఇటీవల ఇద్దరు కవల ఆడపిల్లలు తండ్రయ్యాడు. ఒకే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ ఇద్దరు కాకతాళీయంగా కవలకు జన్మినవ్వడం చర్చనీయాంశం అయింది.