Just In
- 29 min ago
మళ్లీ ప్రేమలో పడ్డ శృతి హాసన్: అతడితో అయిపోయిందంటూ.. పుసుక్కున నోరు జారి బుక్కైంది
- 1 hr ago
RRR నుంచి అదిరిపోయే అప్డేట్: గుడ్ న్యూస్ చెప్పిన ఎన్టీఆర్, చరణ్.. వాళ్లిచ్చే సర్ప్రైజ్ అదే!
- 3 hrs ago
హాలీవుడ్ చిత్రం గాడ్జిల్లా vs కాంగ్ ట్రైలర్ విడుదల: తెలుగుతో పాటు ఆ భాషల్లో కూడా వదిలారు
- 3 hrs ago
మహేశ్ బాబు పేరిట ప్రపంచ రికార్డు: సినిమాకు ముందే సంచలనం.. చలనచిత్ర చరిత్రలోనే తొలిసారి ఇలా!
Don't Miss!
- Sports
ఇంగ్లండ్ అలా చేయకుంటే భారత్ను అవమానపరిచినట్టే.. జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్ల ఫైర్!
- News
జగన్ తన గొయ్యి తానే తీసుకుంటున్నాడు, ఉద్యోగుల తీరు ఇలా దేశ చరిత్రలోనే లేదు : యనమల ఫైర్
- Finance
భారీ లాభాల నుండి, భారీ నష్టాల్లోకి: రిలయన్స్ మహా పతనం
- Lifestyle
జనన నియంత్రణ ఉన్నప్పటికీ గర్భం వచ్చే ప్రమాదం
- Automobiles
ఇదుగిదిగో.. కొత్త 2021 ఫోర్స్ గుర్ఖా; త్వరలో విడుదల, కొత్త వివరాలు వెల్లడి
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మంత్రుల జోక్యం: సెన్సార్ బోర్డ్ చీఫ్ రాజీనామా
ముంబై: సినిమాలకు సెన్సార్ బోర్డ్ సర్టిఫికేషన్ జారీ చేసే విషయాల్లో కొందరు కేంద్ర మంత్రులు జోక్యం చేసుకోవడాన్ని నిరసిస్తూ కేంద్ర సెన్సార్ బోర్డ్ చీఫ్ లీలా శాంసన్ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. డేరా సచ్చా సౌదా అధ్యక్షుడు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్కు సంబంధించిన వివాదాస్పద చిత్రం ‘మెసెంజర్ ఆఫ్ గాడ్' సెన్సార్ సర్టిఫికెషన్ విషయంలో ఈ వివాదం చోటు చేసుకుంది.

ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు సర్టిపికెట్ ఇవ్వాలని నిర్ణయించింది. అయితే కేంద్ర మంత్రులు ఈ విషయంలో జోక్యం చేసుకుని సినిమాను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. బోర్డు నిర్ణయాలపై మంత్రుల జోక్యాన్నినిరసిస్తూ లీలా శాంసన్ రాజీనామా ప్రకటించారు. బోర్డు విషయాల్లో మంత్రులు జోక్యం చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందని, మంత్రిత్వ శాఖ నియమించిన సభ్యులు, అధికారుల అవినీతి.... వారి జోక్యం కారణంగా రాజీనామా చేయాల్సి వచ్చిందని అన్నారు.
లీలా సాంసన్ రాజీనామా ఇపుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఆమె రాజీనామాకు ముందే ఈ చిత్రానికి సెన్సార్ క్లియరెన్స్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ‘మెసెంజర్ ఆఫ్ గాడ్' చిత్రాన్ని నిలిపి వేసారు. అయితే రాజీనామా విషయంలో తాను వెనక్కి తగ్గేది లేదని లీలా సాంశన్ తెలిపారు. ఈ నేపథ్యంలో తర్వాతి పరిణామాలు ఎలా ఉంటాయనేది ఆసక్తిగా మారింది.