Don't Miss!
- News ఎల్లుండే వైసీపీలోకి యనమల ? చర్చలు పూర్తి..!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
దొంగతనం కేసులో సెన్సార్ బోర్డు సభ్యురాలి అరెస్టు
వివరాల్లోకి వెళితే... కేంద్ర సెన్సారు బోర్డు సభ్యురాలు ఒకరు తన సహోద్యోగిని ఆభరణాలను అపహరించి....పోలీసులకు దొరికిపోయారు. ఈనెల నాలుగోతేదీన జరిగిన ఈ దొంగతనం వివరాలను పోలీసులు శనివారం నాడిక్కడ వెల్లడించారు. మీనాక్షి సింగ్ అనే సెన్సారు బోర్డు సభ్యురాలు తన సహోద్యోగిని అయిన కిరణ్ శ్రీవాత్సవతో కలిసి ఒక భోజ్పురి చిత్రాన్ని నాలుగో తేదీన సెన్సార్ చేస్తున్నారు. ఒక మినీథియేటర్లో ఈ కార్యక్రమం నడుస్తుండగా...తన పక్కనే ఉన్న కిరణ్ బ్యాగులో నుంచి మీనాక్షి చాకచక్యంగా వజ్రాభరణాలను తస్కరించేశారు.
చలనచిత్రం సెన్సారు పని పూర్తయిన తర్వాత బ్యాగులో చూసుకున్న కిరణ్కు తన ఆభరణాలు పోయినట్లు తెలిసింది. వెంటనే ఆమె మీనాక్షి...మరో ముగ్గురు సభ్యులతో కలిసి అక్కడంతా వెతికారు. ఫలితం లేకపోయింది. ఇంట్లో ఏమైనా మర్చిపోయానేమోనని ఇంటికెళ్లి చూసినా దొరకలేదు. దీంతో, కిరణ్ సంబంధిత పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
సినిమా సెన్సారు జరిగిన మినీథియేటర్లోని సీసీటీవీ దృశ్యాల్లో మీనాక్షి అనుమానాస్పద కదలికలను గమనించిన పోలీసులు ఆమెను గట్టిగా ప్రశ్నించారు. చేసిన తప్పును మీనాక్షి అంగీకరించారు. ఆమె నివాసం నుంచి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన మీనాక్షికి బెయిలు లభించినట్లు పోలీసులు తెలిపారు.