Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
సమంత-సిద్ధార్థ ‘జబర్దస్త్’ సెన్సార్ కట్స్ ఇవే..
హైదరాబాద్: సిద్ధార్థ-సమంత జంటగా నటిస్తున్న 'జబర్దస్త్' మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని... U/A సర్టిఫికెట్ పొందిన సంగతి తెలిసిందే. తాజాగా ఈచిత్రానికి సంబంధించిన సెన్సార్ సర్టిఫికెట్ బయటకు వచ్చింది. అందులో ఏయే సీన్లకు, డైలాగులు సెన్సార్ అధికారులు కత్తెర వేసారో ఓ లుక్కేద్దాం.
సెన్సార్
కట్స్..
1.
సినిమాలో
గుర్రం
కనిపించే
సన్నివేశాలు
తొలగించాలి.
లేదా
'యానిమల్
వెల్ఫేర్
బోర్డ్'
నుంచి
నో
అబ్జెక్షన్
సర్టిఫికెట్
తీసుకోవాలి.
2. మద్యపానం, ధూమపానం సన్నివేశాలపై చట్టబద్దమైన హెచ్చరికలు జారీ చేయాలి. అదే విధంగా ఈ రెండు ఆరోగ్యానికి హానికరమంటూ చెప్పాలి.
3. సినిమా డైలాగుల్లో..... లంచం తీసుకున్న న్యాయమూర్తి పాపాలు, మోసం చేసిన కల్కి, నిత్యానంద స్వామి, మాయావతి పదాలను డిలీట్ చేయ్యాలి.
4. 'అల్లా అల్లా' సాంగులో.... 'అల్లా అల్లా' పదాలను తొలగించి ఆ స్థానంలో 'హల్లా గుల్లా' అనే పదాలతో రీప్లేస్ చేయాలి.
ఫిబ్రవరి 22న ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 'అలా మొదలైంది' ఫేం నందినీరెడ్డి ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నండగా ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ శ్రీసాయిగణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ఆడియోకు మంచి స్పందన వస్తోంది. అలా మొదలైంది చిత్రాన్ని యూత్ అండ్ ఫ్యామిలీ మెచ్చేలా వినోదాత్మకంగా తెరకెక్కించిన దర్శకురాలు నందినీరెడ్డి 'జబర్దస్త్' చిత్రాన్ని మాస్ మసాలా అంశాలతో తెరకెక్కించారు.
ఈ చిత్రంలో సిద్ధార్థ పాత్ర విభిన్నంగా ఉండటంతో మంచి కామెడీ టైమింగుతో ఉంటుంది. అదే విధంగా హీరోయిన్ సమంత పాత్ర రౌడీలా ఉంటుందట. ఈ విషయాలు స్వయంగా దర్శకురాలు నందినీ రెడ్డి వెల్లడించారు. మొత్తానికి ఈచిత్రం ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతుంది అంటున్నారు. సమంతా, నిత్యామీనన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: థమన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బి .మహేంద్రబాబు, నిర్మాత: బెల్లంకొండ సురేష్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: బి.వి.నందిని రెడ్డి.