twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రసాద్స్‌లో ‘రాంబాబు’కేక...రికార్డ్ ‘షో’లు

    By Bojja Kumar
    |

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం రేపు గ్రాండ్‌గా విడుదలవుతున్న సంగతి తెలిసింది. తొలి రోజు భారీ సంఖ్యలో థియేటర్లలో విడుదలువున్న ఈ చిత్రం.....హైదరాబాద్ లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో రికార్డు స్థాయిలో తొలి రోజే ఏకంగా 43 షోల్లో ప్రదర్శితం అవుతోంది.

    ప్రసాద్స్‌ మల్టీప్లెక్స్ స్క్రీన్లలో 30 షోలు, బిగ్ స్క్రీన్‌లో 13 షోలు ప్రదర్శిస్తున్నారు. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా ఒక్క రోజులో ఇక్కడ ఇన్ని షోలు ప్రదర్శించ లేదు. రేపు ప్రసాద్ మల్టీ ప్లెక్స్ మొత్తం 'కెమెరామెన్ గంగతో రాంబాబు' మయం కాబోతోంది. పవర్ స్టార్, మెగా అభిమానులతో రేపు ప్రసాద్ మల్టీప్లెక్స్ కిక్కిరిపోనుంది.

    ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా నటిస్తున్నారు. అన్యాయాలను ఎదురించే ధైర్యంగల రిపోర్టర్‌గా పవన్ కనిపించనున్నాడు. పవన్ కళ్యాణ్ కి జంటగా హీరోయిన్ తమన్నా ఇందులో కెమెరామెన్ పాత్ర చేస్తోంది. ప్రీమియర్ షో రిపోర్ట్ ప్రకారం.... ఈ చిత్రం 'గబ్బర్ సింగ్' చిత్రాన్ని మించి మోగా హిట్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది.

    ప్రకాష్‌రాజ్‌, గ్యాబ్రియల్‌, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, ఆలీ, ఎమ్మెస్‌ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మ ణ్యం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: శ్యామ్‌ కె.నాయుడు, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, సంగీతం: మణిశర్మ, నిర్మాణం: యూ నివర్సల్‌ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డి.వి.వి. దానయ్య, కథ-స్క్రీన్‌ప్లే- మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాధ్‌.

    English summary
    Pawan Kalyan’s ‘Cameraman Ganga Tho Rambabu’ record number of 43 shows for the first day including 30 shows in Multiplex and 13 shows on Big Screen at Prasads IMax.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X