Don't Miss!
- News మేషరాశిలో శుక్ర దహనం.. ఈ రాశులవారికి కెరీర్ లో పెనుసవాళ్లు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
‘చందమామలో అమృతం’ గేమ్ రూపంలో...
హైదరాబాద్ :టీవీ చూసే ప్రేక్షకులకు చిరపరిచితమైన సీరియల్ 'అమృతం'. హర్షవర్థన్, గుండు హనుమంతరావులు ప్రధాన పాత్రలు పోషించిన ఆ సీరియల్ను జస్ట్ ఎల్లో మీడియా ప్రై.లి. పతాకంపై 'చందమామలో అమృతం'టైటిల్ తో సినిమాగా రూపొందించిన సంగతి తెలిసిందే. తాజాెగా ఇప్పుడీ నిర్మాతలు ఈ చిత్రం కాన్సెప్టుతో ఓ గేమ్ డిజైన్ చేసి వదిలారు. పాపులర్ అయిన టెంపుల్ రన్ మోడల్ లో ఈ గేమ్ ఉండనుంది. వడలు,దోసెలతో చాలా ఇంట్రస్టుగా ఈ గేమ్ రూపొందింది. ఈ నెలలోనే ఈ చిత్రం ఆడియో విడుదల కానుంది. చిత్రంలో అవసరాల శ్రీనివాస్, హరీష్ హీరోలుగా నటిస్తున్నారు. అప్పాజీగా శివన్నారాయణ, సర్వంగా వాసు ఇంటూరి తమ పాత్రల్లో తామే నటిస్తున్నారు.
ఈ విషయమై గుణ్ణం గంగరాజు మాట్లాడుతూ.. "దాదాపు సినిమాలో మూడు వంతులు చంద్రుడుపై జరుగుతుంది. 44 నిముషాల పాటు స్పేస్ లోనే జరుగుతుంది. ముఖ్యంగా 19 నిముషాల గ్రాఫిక్స్ అద్బుతంగా ఉంటాయి. మేము ఊహించిన దానికన్నా విజువల్ ఎఫెక్ట్స్ కు ఎక్కువ సమయం పట్టింది. ఈ వారంలో ఆడియోని త్వరలో సినిమాని విడుదల చేస్తాం." అన్నారు.
అలాగే 'చంద్రమండలంపై జరిగే కథ ఇది. ఓ గొప్ప అంతరిక్ష చిత్రం అని కూడా చెప్పొచ్చు. రెండున్నర గంటలపాటు కడుపుబ్బా నవ్వించేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాం. బుల్లితెరపై ప్రసారమైన ధారావాహికకు ఈ సినిమాకీ మధ్య ఎలాంటి సంబంధం లేదు. కేవలం అందులోని పాత్రలు మాత్రమే ఈ చిత్రంలో కనిపిస్తాయి. ధారావాహికల్లో కనిపించే పాత్రలతో సినిమాల్ని తీయడం అరుదు. ఇదివరకు మిస్టర్ బీన్ తరహాలో కొన్ని పాత్రలు మాత్రమే వెండితెరపై సందడి చేశాయి. మేం తొలిసారిగా తెలుగులో ఆ ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో యాభై నిమిషాలపాటు గ్రాఫిక్స్ ఉంటాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం ''అన్నారు.
మన దేశంలో తొలిసారిగా స్పేస్ నేపధ్యంలో తీస్తున్న చిత్రం 'చందమామలో అమృతం'. మొదట ఈ సినిమా ఆగష్టులో విడుదల ప్లాన్ చేసారు. కానీ గ్రాఫిక్స్ వర్క్ డిలే కావంటంతో ఈ సినిమా వాయిదాలు పడుతూ వస్తోంది. ఇక ఈ చిత్రం సెకండాఫ్ మొత్తం చంద్రుడిపై జరుగుతుంది. సుచిత్ర, ఆహుతిప్రసాద్, చంద్రమోహన్, కృష్ణ భగవాన్, ఎల్.బి.శ్రీరామ్, రావు రమేష్ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: రసూల్ ఎల్లోర్, సంగీతం: శ్రీ, కూర్పు: ధర్మేంద్ర, పాటలు: అనంత శ్రీరామ్.