Don't Miss!
- Travel ఐఆర్సిటీసి వారి హైదరాబాద్ టు అహ్మదాబాద్ 8 రోజుల ట్రైన్ టూర్ ప్యాకేజీ...
- News కేసీఆర్ డ్రామా అదిరిందయ్యా చంద్రం!
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Sports ఆ చెత్త నిర్ణయమే ఆర్సీబీ కొంపముంచింది- ఫించ్
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
సవ్యసాచి అందుకే ఫ్లాప్ అయింది.. డైరెక్టర్ కామెంట్స్
మొదటి చిత్రం కార్తికేయతో తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు చందూ మొండేటి. ఆపై ప్రేమమ్ రీమేక్ను తెరకెక్కించి మరోసారి సత్తాచాటాడు. అయితే రీమేక్ తెరకెక్కించడంలో సఫలమైన చందూ మొండేటికి మరో ఛాన్స్ ఇచ్చాడు నాగ చైతన్య. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఆ చిత్రమే సవ్యసాచి. అయితే టీజర్, ట్రైలర్తో అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించిన సవ్యసాచి పూర్తి చిత్రంగా ఆకట్టుకోలేకపోయింది.
తెలుగు తెరపై మాధవన్ మెరవడం, కాన్సెప్ట్ కొత్తగా ఉండటం, ప్రతిభ గల దర్శకుడు కావడంతో సవ్యసాచికి మంచి డిమాండ్ ఏర్పడింది. అంతేకాకుండా మైత్రి మూవీస్ వంటి పెద్ద నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన చిత్రం కావడంతో అందరూ ఓ స్థాయిలో ఊహించుకున్నారు. తీరా చూస్తే బాక్సాఫీస్ వద్ద ఘోరమైన పరాజయాన్ని చవిచూసింది. అంతలా బెడిసి కొట్టడానికి గల కారణాలను తాజాగా దర్శకుడు చందూ మొండేటి వివరించాడు.
విభిన్నమైన కథ రాసుకుంటే.. దాన్ని అంతే విభిన్నంగా తెరకెక్కించాలని తెలిపాడు. కమర్షియల్ హంగుల పేరిట అనవసరమైనవి చేర్చకూడదని అన్నాడు. సవ్యసాచి విషయంలో అదే తప్పు జరిగిందని చెప్పుకొచ్చాడు. దర్శకుడిగా తాను తీసుకున్న నిర్ణయాల వల్లే తప్పులు జరిగాయని ఒప్పుకున్నాడు. ఆ సినిమా ఫలితం తనను, నాగచైతన్యను నిరాశకు గురి చేసిందని అన్నాడు. అయినా నాగచైతన్యతో స్నేహం పదిలంగానే ఉందని పేర్కొన్నాడు. కార్తికేయ-2 టీజర్ చూసి అభినందించాడని తెలిపాడు.