Don't Miss!
- News మైసూరు మహారాజుకు లేఖ రాసిన మోదీ, మీరు కచ్చితంగా వస్తారని ఎదురుచూస్తున్నా, ఆ సీటు మీదే !
- Finance Gold Rate: గుడ్న్యూస్.. కుప్పకూలిన పసిడి ధర.. నేడు రూ.15,300 తగ్గిన గోల్డ్ రేటు..
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
- Sports జైస్వాల్.. వాళ్లపై ఎందుకంత కక్ష?- సునీల్ గవాస్కర్
- Lifestyle Mango Tea: ఇకపై తొక్కేకదా అని పారేయకండి.. ఇలా టీ చేసుకుని తాగండి..శరీరంలో జరిగే అద్భుతాలు చూడండి..
- Technology శాంసంగ్ స్మార్ట్ఫోన్ డిస్ప్లేలో గ్రీన్ లైన్ కనిపిస్తోందా.. అయితే ఉచితంగా స్క్రీన్ రీప్లేస్ చేస్తారు...
- Automobiles ఎన్నో అంచనాల మధ్య లాంచ్ అయిన క్లచ్లెస్ బైక్ TVS Jive.. ఎందుకు ఫెయిల్ అయింది.??
సవ్యసాచి అందుకే ఫ్లాప్ అయింది.. డైరెక్టర్ కామెంట్స్
మొదటి చిత్రం కార్తికేయతో తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు చందూ మొండేటి. ఆపై ప్రేమమ్ రీమేక్ను తెరకెక్కించి మరోసారి సత్తాచాటాడు. అయితే రీమేక్ తెరకెక్కించడంలో సఫలమైన చందూ మొండేటికి మరో ఛాన్స్ ఇచ్చాడు నాగ చైతన్య. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఆ చిత్రమే సవ్యసాచి. అయితే టీజర్, ట్రైలర్తో అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించిన సవ్యసాచి పూర్తి చిత్రంగా ఆకట్టుకోలేకపోయింది.
తెలుగు తెరపై మాధవన్ మెరవడం, కాన్సెప్ట్ కొత్తగా ఉండటం, ప్రతిభ గల దర్శకుడు కావడంతో సవ్యసాచికి మంచి డిమాండ్ ఏర్పడింది. అంతేకాకుండా మైత్రి మూవీస్ వంటి పెద్ద నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన చిత్రం కావడంతో అందరూ ఓ స్థాయిలో ఊహించుకున్నారు. తీరా చూస్తే బాక్సాఫీస్ వద్ద ఘోరమైన పరాజయాన్ని చవిచూసింది. అంతలా బెడిసి కొట్టడానికి గల కారణాలను తాజాగా దర్శకుడు చందూ మొండేటి వివరించాడు.
విభిన్నమైన కథ రాసుకుంటే.. దాన్ని అంతే విభిన్నంగా తెరకెక్కించాలని తెలిపాడు. కమర్షియల్ హంగుల పేరిట అనవసరమైనవి చేర్చకూడదని అన్నాడు. సవ్యసాచి విషయంలో అదే తప్పు జరిగిందని చెప్పుకొచ్చాడు. దర్శకుడిగా తాను తీసుకున్న నిర్ణయాల వల్లే తప్పులు జరిగాయని ఒప్పుకున్నాడు. ఆ సినిమా ఫలితం తనను, నాగచైతన్యను నిరాశకు గురి చేసిందని అన్నాడు. అయినా నాగచైతన్యతో స్నేహం పదిలంగానే ఉందని పేర్కొన్నాడు. కార్తికేయ-2 టీజర్ చూసి అభినందించాడని తెలిపాడు.