Don't Miss!
- Sports Tilak Varma:అతని కోసమే ఆ సంబరాలు! వీడియో
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- News ఎన్నికల వేళ కోర్టుల్ని ప్రభావితం చేసే కుట్ర ! సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ-మోడీ కౌంటర్
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ప్రముఖ హీరోయిన్ వేశ్యగా ‘లెటర్’
టెన్త్ క్లాస్, నోట్ బుక్ వంటి వినూత్న ప్రేమకథా చిత్రాలను తెరకెక్కించిన యువ దర్శకుడు చందు తాజాగా 'లెటర్' అనే పేరుతో ఓ విభిన్నమైన సంగీతభరిత ప్రేమకథా చిత్రాన్ని రూపొందించబోతున్నాడు. 'నీకు-నాకూ మధ్య' అనే ఉప శీర్షికతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని శ్రీ కనకదుర్గ ఆర్ట్స్ పతాకంపై ఎం.వి.రావు సమర్పణలో కేఎస్ శైలకుమార్ నిర్మిస్తారు. త్వరలో చిత్రీకరణ ప్రారంభం కానున్న ఈ చిత్ర విశేషాలను దర్శకుడు తెలియజేస్తూ 'ఓ వినూత్నమైన కథాంశంతో రూపొందనున్న ఈ చిత్రంలో ఓ ప్రముఖ హీరోయిన్ వేశ్య పాత్రలో కనిపించబోతుంది. సాధారణంగా అభినయానికి ఆస్కారమున్న వేశ్య పాత్ర చేయడానికి హీరోయిన్లు మక్కువ చూపిస్తుంటారు.
మా చిత్రంలో కూడా ఓ ప్రముఖ హీరోయిన్ ఆ పాత్రను చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆమె పేరును త్వరలోనే ప్రకటిస్తాం. ఓ వేశ్యకు, ఓ రచయితకు, ఓ గాయనీకి మధ్య జరిగే మ్యూజికల్ లవ్ స్టోరీ ఇది' అన్నారు. నిర్మాత శైలకుమార్ మాట్లాడుతూ 'ప్రముఖ హీరోయిన్ తో పాటు ఈ చిత్రంలో ఇతర ముఖ్యపాత్రల్లో నూతన తారాగణం నటిస్తారు. ప్రస్తుతం వారి అన్వేషణ కొనసాగుతుంది. త్వరలోనే చిత్రీకరణ పనులు ప్రారంభిస్తాం' అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శివరామ్, పాటలు: వెన్నెలకంటి, సమర్పణ: ఎంవీ రావు.