twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బన్ని ‘ఇద్దరమ్మాయిలతో’లో హీరోయిన్ మార్పు

    By Srikanya
    |

    హైదరాబాద్ : పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా 'ఇద్దరమ్మాయిలతో...' అనే చిత్రం రూపుదిద్దుకోబోతోంది. ఈ చిత్రంలో మరో మార్పు చేసుకుంది. హీరోయిన్ గా అల్లు అర్జున్‌తో కలిసి ఆడిపాడే అవకాశాన్ని రిచా గంగోపాధ్యాయ చేజార్చుకొంది. అల్లు అర్జున్‌ తన ప్రక్కన రిచా నప్పదు అని చెప్పటంతో ఆయన సలహా పైనే తాప్సీ ని తీసుకున్నట్లు సమాచారం. మెయిన్ హీరోయిన్ గా అమలాపాల్‌ని ఎంచుకొన్నారు. ఈ సినిమాకి బండ్ల గణేష్‌ నిర్మాత. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తారు.

    అలాగే లొకేషన్ లో మొదటి అనుకున్నట్లు కాకుండా మార్పు జరిగింది. ''బ్యాంకాక్ తర్వాత స్పెయిన్ అంటే నాకిష్టం. అందుకే అల్లు అర్జున్‌తో నేను చేయబోతున్న 'ఇద్దరమ్మాయిలతో' షూటింగ్‌ని అక్కడే చేయబోతున్నాను. కథ రీత్యా ఈ సినిమా మేజర్ పార్ట్ అక్కడే జరుగుతుంది'' అని ఇటీవల ఓ సందర్భంలో మీడియాతో చెప్పారు దర్శకుడు పూరి జగన్నాథ్. అనుకున్నట్టే స్పెయిన్‌లోని 'బార్సీలోనా'లో ఈ సినిమా చిత్రీకరణకు ప్లాన్ చేశారాయన.

    అయితే అనుమతులు లభించకపోవడం వల్లనో లేక అక్కడి పరిస్థితుల ప్రభావం వల్లనో స్పెయిన్‌లో షూటింగ్ జరపాలనుకొనే ఆలోచనను పక్కన పెట్టేశారు పూరీ. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో కానీ న్యూజిలాండ్‌లో కానీ చిత్రీకరణ జరపాలనుకుంటున్నారని సమాచారం. ఈ నెల రెండో వారం నుంచి చిత్రీకరణ మొదలు కానుంది. అది ఆస్ట్రేలియాలోనా, న్యూజిలాండ్‌లోనా అనేది తెలియాల్సి ఉంది.

    అల్లు అర్జున్‌ని మాస్‌లోకి చొచ్చుకువెళ్లేలా చేసిన సినిమా 'దేశముదురు'. పూరి జగన్నాథ్ మార్క్ పాత్ర చిత్రణతో అందులో అల్లు అర్జున్ పూర్తి మాసివ్‌గా, ఎనర్జిటిక్‌గా కనిపించారు. మళ్లీ వీరిద్దరి కలయికలో ఓ సినిమా రూపొందనుంది. వైవిధ్యభరితంగా టైటిల్స్ పెట్టే పూరి ఈ చిత్రం కోసం 'ఇద్దరమ్మాయిలతో' అనే టైటిల్ ఫిక్స్ చేయటంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. పూరి తరహా రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఇది రూపొందనుంది. అమలా పాల్‌, రిచా గంగోపాధ్యాయ హీరోయిన్స్. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్యామ్‌.కె.నాయుడు, నృత్యాలు: దినేష్‌, కళ: చిన్నా, కూర్పు: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌. కో-రైటర్స్: బి.వి.ఎస్. రవి, కళ్యాణ్‌ వర్మ.

    English summary
    
 Iddarammayilatho is about an Indian youngster falling in love with two young girls in a foreign country. Amala Paul is the main heroine. Meanwhile, it is also said that Tapsee has now stepped in as second heroine in the place of Richa Gangapodhyay. At the time of launch, Richa's name was announced but Allu Arjun reportedly not happy with her. So Tapsee steps in. The film is being produced by Bandla Ganesh.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X