Don't Miss!
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- News ఏపీలో కూటమికి వచ్చే సీట్లు ఇవే- రఘురామ తాజా అంచనా..!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Lifestyle మనోడు ఎక్కడైనా తగ్గేదేలే అనిపించుకున్నాడు, అల్లు అర్జున్ కు అంతర్జాతీయ గుర్తింపు
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
బన్ని ‘ఇద్దరమ్మాయిలతో’లో హీరోయిన్ మార్పు
హైదరాబాద్ : పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా 'ఇద్దరమ్మాయిలతో...' అనే చిత్రం రూపుదిద్దుకోబోతోంది. ఈ చిత్రంలో మరో మార్పు చేసుకుంది. హీరోయిన్ గా అల్లు అర్జున్తో కలిసి ఆడిపాడే అవకాశాన్ని రిచా గంగోపాధ్యాయ చేజార్చుకొంది. అల్లు అర్జున్ తన ప్రక్కన రిచా నప్పదు అని చెప్పటంతో ఆయన సలహా పైనే తాప్సీ ని తీసుకున్నట్లు సమాచారం. మెయిన్ హీరోయిన్ గా అమలాపాల్ని ఎంచుకొన్నారు. ఈ సినిమాకి బండ్ల గణేష్ నిర్మాత. దేవిశ్రీప్రసాద్ స్వరాలు సమకూరుస్తారు.
అలాగే లొకేషన్ లో మొదటి అనుకున్నట్లు కాకుండా మార్పు జరిగింది. ''బ్యాంకాక్ తర్వాత స్పెయిన్ అంటే నాకిష్టం. అందుకే అల్లు అర్జున్తో నేను చేయబోతున్న 'ఇద్దరమ్మాయిలతో' షూటింగ్ని అక్కడే చేయబోతున్నాను. కథ రీత్యా ఈ సినిమా మేజర్ పార్ట్ అక్కడే జరుగుతుంది'' అని ఇటీవల ఓ సందర్భంలో మీడియాతో చెప్పారు దర్శకుడు పూరి జగన్నాథ్. అనుకున్నట్టే స్పెయిన్లోని 'బార్సీలోనా'లో ఈ సినిమా చిత్రీకరణకు ప్లాన్ చేశారాయన.
అయితే అనుమతులు లభించకపోవడం వల్లనో లేక అక్కడి పరిస్థితుల ప్రభావం వల్లనో స్పెయిన్లో షూటింగ్ జరపాలనుకొనే ఆలోచనను పక్కన పెట్టేశారు పూరీ. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో కానీ న్యూజిలాండ్లో కానీ చిత్రీకరణ జరపాలనుకుంటున్నారని సమాచారం. ఈ నెల రెండో వారం నుంచి చిత్రీకరణ మొదలు కానుంది. అది ఆస్ట్రేలియాలోనా, న్యూజిలాండ్లోనా అనేది తెలియాల్సి ఉంది.
అల్లు అర్జున్ని మాస్లోకి చొచ్చుకువెళ్లేలా చేసిన సినిమా 'దేశముదురు'. పూరి జగన్నాథ్ మార్క్ పాత్ర చిత్రణతో అందులో అల్లు అర్జున్ పూర్తి మాసివ్గా, ఎనర్జిటిక్గా కనిపించారు. మళ్లీ వీరిద్దరి కలయికలో ఓ సినిమా రూపొందనుంది. వైవిధ్యభరితంగా టైటిల్స్ పెట్టే పూరి ఈ చిత్రం కోసం 'ఇద్దరమ్మాయిలతో' అనే టైటిల్ ఫిక్స్ చేయటంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. పూరి తరహా రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఇది రూపొందనుంది. అమలా పాల్, రిచా గంగోపాధ్యాయ హీరోయిన్స్. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్యామ్.కె.నాయుడు, నృత్యాలు: దినేష్, కళ: చిన్నా, కూర్పు: ఎస్.ఆర్.శేఖర్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. కో-రైటర్స్: బి.వి.ఎస్. రవి, కళ్యాణ్ వర్మ.