Don't Miss!
- Sports T20 World Cup 2024: సంజూ శాంసన్కు మళ్లీ అన్యాయమే!
- News మోదీని ప్రధానిని చెయ్యండి.. తెలంగాణాలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- Technology వన్ప్లస్ 13 స్మార్ట్ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
తెలుగు హీరోలపై ఛార్మింగ్ గర్ల్ చార్మి కంప్లైంట్...
మన హీరోలంతా యేడాదికి రెండు మూడు సినిమాలకు మించి చేయడం లేదు. దాంతో హీరోయిన్స్ కి ఎక్కువ అవకాశాలు రావడం లేదు అంటూ తన కెరీర్ మూలనపడటానికి హీరోల బద్దకమే కారణం అంటూ విశ్లేషించింది చార్మి. ఆమెను ఈ మధ్య మీ జోరు తగ్గిందేమిటి అని అడిగితే దానికి నిట్టూరుస్తూ ఇలా స్పందించింది. అలాగే ఆ కారణం చేతే చిన్న సినిమాల వైపు కూడా మేము చూడాల్సివస్తోంది. హీరోయిన్ ప్రాధాన్యం ఉన్న సినిమాలని ఒప్పుకోవలసి వస్తుంది అని చెప్పింది.ఇక హీరో పక్కన రెండుమూడు పాటల్లో మెరిస్తే చాలు జనానికి నచ్చుతాయ.
స్టార్ హీరోలు పక్కన హీరోయిన్ గా కనిపించడానికి ఎవరైనా సిద్ధంగా ఉంటారు. అక్కడ తమ పాత్ర పరిధి ఎంత అని కూడా ఆలోచించరు. నేనూ అలాగే భావిస్తాను అంది అదీ సంగతి. కాబట్టి ఆమ కు స్టార్ హీరోలు కరుణించి పాత్రలు ఇవ్వాలి.అలాగే వాళ్ళు కూడా కంటిన్యూగా సినిమా లు చేయాలి. ప్రస్తుతం ఓ అర్ధరాత్రి ఓ లేడీ జర్నలిస్ట్ చేసిన సాహసాన్ని ఇతివృత్తంగా తీసుకొని రూపొందించిన చిత్రం 'నగరం నిద్రపోతున్న వేళ". చార్మి జర్నలిస్ట్గా నటించింది. జగపతి బాబు ఇందులో ప్రత్యేక పాత్ర చేశారు. ప్రేమ్రాజ్ దర్శకత్వంలో నంది శ్రీహరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం జూన్ 17న విడుదల కానుంది.