తెలుగుసినిమా రంగంలో చార్మి స్ధిరపడిపోయింది. ఈ ఏడాది రామానాయుడి సినిమాతో పాటు మరో రెండు సినిమాల్లో నటించనుంది. తన అభిమాన దర్శకుడు కృష్ణవంశీ అని, ఆయనే తనకు తెలుగు సినిమారంగంలో గట్టి పునాది వేశారని ఆమె అంటోంది. ఒక సంగీత దర్శకుడితో కూడా ప్రేమాయణం ఉందా అని ప్రశ్నిస్తే ఆ వదంతి గురించి తానూ విన్నానని చెప్పింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని తెగమెచ్చుకుంది. ఆయన ట్యూన్స్ వింటే పురి విప్పిన నెమలిలా ఆడాలనిపిస్తుందని చార్మి చెప్పింది. ఏ హీరోయిన్ అయినా చిరంజీవి సరసన నటించాలనుకుంటుందని, తనకూ ఆ కోరిక ఉందని చార్మి చెప్పింది. కానీ తాను పెద్ద హీరోయిన్ ఆయ్యే సరికే చిరంజీవి సినిమాలను విడిచి రాజకీయాల్లోకి వెళ్ళిపోయారని ఆమె బాధ పడింది.