Don't Miss!
- News క్యూ నిల్చొని ఓటు వేసిన సూపర్ స్టార్
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
శివరాత్రినాడు భయపెట్టటానికి చార్మి ప్రిపరేషన్
చార్మి ప్రధాన పాత్రగా దర్శకుడు ఓషో తులసీరామ్(మంత్ర ఫేమ్) రూపొందించిన చిత్రం 'మంగళ'. మంత్ర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సిహెచ్.వి. శర్మ, ఓషో తులసీరామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిర్మాణ పనులన్నీ ముగింపుకొచ్చిన ఈ చిత్రాన్ని మహాశివరాత్రి సందర్భంగా మార్చి 2న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని చిత్ర సమర్పకుడు గంగపట్నం శ్రీధర్ మీడియాకు తెలియజేస్తూ "చార్మికి ఇదొక వైవిధ్యమైన చిత్రం.ఇటీవల విడుదలైన పాటలకి అద్భుత స్పందన వచ్చినందుకు ఆనందంగా ఉంది. గతంలో మా కాంబినేషన్లో వచ్చిన 'మంత్ర' మాదిరిగానే ఈ సినిమా కూడా అందర్నీ అలరిస్తుందనే నమ్మకముంది. ప్రేక్షకుల్ని భయపెట్టడానికి చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేశారు. మేం మాత్రం కొత్త పంథాలో వెళ్లాం. చార్మి నటన ఈ సినిమాకి ప్రధాన బలం. ఆహార్యం విషయంలో చార్మి ప్రత్యేక శ్రద్ధ తీసుకొంది. ప్రతి సన్నివేశం ప్రేక్షకుల్ని ఆలోచనల్లో పడేస్తుంది '' అన్నారు. ప్రదీప్ రావత్, విజయ్సాయి, ఉత్తేజ్, పావలా శ్యామల తారాగణమైన ఈ చిత్రానికి సంగీతం: విశ్వ, ఛాయాగ్రహణం: శివేంద్ర, సహ నిర్మాత: నాగేశ్వరరెడ్డి, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: ఓషో తులసీరామ్.