Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
వెయ్యిమంది నాగ సాధువులుతో ఛార్మి
ఇటీవల ఛార్మీ , వెయ్యిమంది నాగ సాధువులు పై భారీ క్లైమాక్స్ను చిత్రించాం అంటున్నారు 'మంగళ' దర్సకుడు ఓషో తులసిరామ్. గంగపట్నం శ్రీధర్ సమర్పణలో 'మంత్ర' ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం 'మంగళ'. ఛార్మి ప్రధాన పాత్రధారి. ఓషో తులసీరామ్ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే వికారాబాద్లో పూర్తయింది.ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ చిత్ర దర్శకుడు ఓషో తులసీరామ్ ఇలా చెప్పారు. అలాగే "ప్రేక్షకులకు నచ్చే వెరైటీ సబ్జెక్ట్ ఇది. గతంలో వచ్చిన 'మంత్ర' లాగానే మరో వైవిధ్యమైన అంశంతో ముందుకు సాగుతున్నాం. పాటలు కూడా రసవత్తరంగా ఉంటాయి. ప్రస్తుతం గ్రాఫిక్స్ పనులు జరుగుతున్నాయి. నవంబర్లో ఆడియో విడుదల చేస్తామ''ని అన్నారు. ఈ చిత్రంలో ప్రదీప్రావత్, సుభాష్, రామ్జగన్, ఉత్తేజ్, పావలా శ్యామల తదితరులు నటించారు. సమర్పణ: గంగపట్నం శ్రీధర్, సహ నిర్మాత: బాణా నాగేశ్వరరెడ్డి, కెమెరా: దాశరథి శివేంద్ర, సంగీతం: విశ్వ.