twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చార్మి చాలా హార్డ్‌వర్కర్‌...ప్రభాస్ ప్రశంస

    By Srikanya
    |

    చార్మి హార్డ్‌వర్కర్‌. తను నాకు మంచి ఫ్రెండ్‌. అలాగే ఆమె చేసిన 'సై ఆట' చిత్రం సక్సెస్‌ అవ్వాలని కోరుకుంటున్నాను' అని ప్రభాస్‌ అని అన్నారు. చార్మి కీలక పాత్రధారి గా ఫ్రేమ్స్‌ ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ సంస్థ కెఆర్‌కె పవన్‌ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'సై ఆట'. ఈ చిత్రంలోని పాటలు అక్షయ మ్యూజిక్‌ ద్వారా విడుదలయ్యాయి. ఈ పంక్షన్ కి గెస్ట్ గా ప్రభాస్ హాజరై పై విధంగా స్పందించారు.

    ఇక పాటలు విడుదల చేసిన అక్షయ మ్యూజిక్‌ కంపెనీ లోగోను దేవిశ్రీ ప్రసాద్‌, చార్మి సంయుక్తంగా ఆవిష్కరించారు. ఆడియో సీడీని పూరి జగన్నాథ్‌ ఆవిష్కరించారు. 'సై ఆట' పాటల సీడీని పూరి జగన్నాథ్‌ విడుదల చేశారు. శ్రీనువైట్ల అందుకున్నారు. ఈ చిత్రంలో శ్రద్ధాదాస్‌ 'గజ్జెల గుర్రం...' అనే పాట పాడారు. ఈ వేదికపై ఆమె ఈ పాటను పాడి అలరించారు. అలాగే చార్మి ఓ పాటకు డాన్స్‌ చేశారు. దేవిశ్రీ ప్రసాద్‌ కూడా సినిమాలో ఉన్న పాట పాడుతూ, డాన్స్‌ చేశారు.

    చార్మి మాట్లాడుతూ, 'నా సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి సినిమా రంగానికి చెందిన ఇంతమంది ప్రముఖులు రావడం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మంచి ఎనర్జీతో కూడిన సంగీతాన్ని అందించారు. నా కెరీర్ ‌లో చిరకాలం గుర్తుంచుకునే చిత్రాల్లో 'సై ఆట' కూడా ఒకటి అవుతుందన్న సంపూర్ణ నమ్మకం నాకు ఉంది' అన్నారు.

    "ఈ చిత్రం పోస్టర్స్‌ చూస్తుంటే దేవిశ్రీ కాంబినేషన్‌ లో నేను చేసిన 'ఆనందం' గుర్తొస్తోంది. ఎనర్జిటిక్‌ మ్యూజిక్‌ అందించే దేవి ఈ చిత్రానికి కూడా అలాంటి పాటలే ఇచ్చి ఉంటాడు' అని శ్రీను వైట్ల అన్నారు. "నెల రోజుల క్రితం ఈ పాటలు విన్నాను. బాగున్నాయి. దేవి పాటలు అందరికీ నచ్చుతాయి. ఈ పాటలు, సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను' అని పూరి జగన్నాథ్‌ చెప్పారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X