Don't Miss!
- News అక్కడ.. యుద్ధ వాతావరణం: భారీగా దాడులు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ప్రేమ మైకం : వేశ్యగా మారిన చార్మి!
దర్శకుడు చందు మాట్లాడుతూ...సెల్యులాయిడ్పై వేశ్య పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంది. ప్రముఖ కథానాయికలంతా ఈ పాత్రలో రాణించి ఎంతో పేరు తెచ్చుకున్నారు. సావిత్రి 'కన్యాశుల్కం'లోనూ, జయప్రద 'ప్రేమ మందిరం'లోనూ, జయసుధ 'కలియుగ స్త్రీ', 'ప్రేమాభిషేకం', 'కురుక్షేత్రంలో సీత', 'ప్రేమ తరంగాలు'లోనూ, లక్ష్మి 'మల్లెపువ్వు'లోనూ, శ్రీదేవి 'మోసగాడు'లోనూ, ప్రభ 'నేరం నాది కాదు ఆకలిది'లోనూ, టబూ 'చాందినీబార్'లోనూ, కరీనా కపూర్ 'చమేలీ'లోనూ, అనుష్క 'వేదం'లోనూ ఈ తరహా పాత్రలు పోషించారు. ఆ స్థాయిలోనే ఇందులో చార్మి పాత్ర ఉంటుందన్నారు.
ఎంతో శ్రద్ధ తీసుకుని ఈ పాత్రను తీర్చిదిద్దుతున్నాం. ఇదొక మ్యూజికల్ లవ్ స్టోరీ. ఒక వేశ్యకు, రచయితకు, సింగర్కు మధ్య జరిగే కథ ఇది. రచయిత, సింగర్ పాత్రలకు కొత్త తారలను ఎంపిక చేసే ప్రయత్నంలో ఉన్నాం'' అని తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ ''ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే చిత్రీకరణ మొదలు పెడతాం ' అన్నారు. ఈచిత్రానికి కెమెరా: ప్రవీణ బంగారి.