Don't Miss!
- Finance Ola Cabs IPO: త్వరలో ఓలా క్యాబ్స్ ఐపీఓ..
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- News టీడీపీ ప్లాన్ బీ- వంగవీటి రాధాకు టికెట్?
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
అనుష్కతో అలా బిహేవ్ చేశా.. చార్మి.. ఆమెపై నాకు డౌట్ ఉండేదని అంజలి
సూపర్ సినిమాతో సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టిన అనుష్క శెట్టి.. అదే జోరును కొనసాగిస్తూ దక్షిణాది చిత్ర పరిశ్రమలో టాప్ రేంజ్కు ఎదిగింది. ఆమె నట ప్రయాణం 15 ఏళ్లు పూర్తి చేసుకొన్న సందర్భంగా అనుష్కను ప్రశంసించే కార్యక్రమాన్ని నిశ్శబ్దం సినిమా యూనిట్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో దర్శకులు రాఘవేంద్రరావు, పూరీ జగన్నాథ్, వైవీఎస్ చౌదరీ పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చార్మి, అంజలిలు అనుష్కపై ప్రశంసలు కురిపించారు.
చార్మి మాట్లాడుతూ, "అనుష్క ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను సీనియర్లా బిహేవ్ చేశాను. అప్పట్నుంచే తను పరిచయం. ఇవాళ తను నాకు అమ్మ. ఆమెలో ఎన్నో గొప్ప గుణాలున్నాయి. ఆమెలా ఉండటం చాలా కష్టం. సహనం, సమతుల్యం విషయంలో ఆమె అద్భుతం. 15 ఏళ్ల కెరీర్ అంటే జోక్ కాదు. ఈ కాలంలో ఆమె అద్భుతమైన పాత్రలు చేసింది. మొన్న 'నిశ్శబ్దం' చూశాం. అందులో అనుష్క తన నటనతో చింపేసింది. 'నిశ్శబ్దం' పెద్ద హిట్ కావాలని ప్రార్థిస్తున్నా. బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ సాధించాలని కోరుకుంటున్నా" అన్నారు.
అంజలి మాట్లాడుతూ, "ఐ లవ్ యూ స్వీటీ. నీది చాలా మంచి హృదయం. 'నిశ్శబ్దం' సెట్స్పై తొలిరోజు నాకు సౌకర్యంగా ఉంటుందా అనే ఫీలింగ్ ఉండేది. తనతో నాకు చాలా కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. తన పుట్టినరోజుకు ఒక పిక్చర్ పోస్ట్ చేశాను, అది తను నన్ను పైకి లేపిన పిక్చర్. ఆమె నుంచి అంత సౌకర్యం పొందాను. ఆమె ఇండస్ట్రీలో మరెన్నో ఏళ్లు ఉండాలి. 'నిశ్శబ్దం'లో నన్ను భాగం చేసినందుకు అందరికీ థాంక్స్. నా కెరీర్లో ఇదొక డిఫరెంట్ మూవీ. అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా" అన్నారు.
ప్రస్తుతం అనుష్క ప్రధాన పాత్ర పోషిస్తోన్న 'నిశ్శబ్దం' ఏప్రిల్ 2న విడుదలకు సిద్ధమవుతోంది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ పతాకాలపై టి.జి. విశ్వప్రసాద్, కోన వెంకట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.